కిటకిటలాడిన మున్సిపల్ కార్యాలయం
షాద్నగర్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ఎస్ఐఆర్ నోటీసులతో షాద్నగర్ మున్సిపల్ కార్యాలయానికి ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఓటు నమోదు, పేర్లు, చిరునామాలకు సంబంధించిన సమస్యలపై అధికారులు విచారణ చేపట్టారు. ఆధారాలు, అవసరమైన పత్రాలను సమర్పించి ఓటర్లు తమ వివరాలను వివరించారు. మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, కమిషనర్ సునీతారెడ్డి ప్రక్రియను పర్యవేక్షించారు.
01-09-2026 | 02:46pm