పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన
షాద్ నగర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం(Central Government) పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనె తగ్గించాలని డిమాండ్ చేస్తు మంగళవారం షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షాద్ నగర్ ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారాయని అగ్గనూర్ బసవేశ్వర్ అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప పేద ప్రజల సంక్షేమం ఏనాడు పట్టించుకోవడంలేదని, ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి మోడి పెట్రోల్, డీజిల్ ధరల విషయం మాట్లాడలేదని అన్నారు.
26-05-2026