18 July, 2026 | 12:18 AM

Districts - Ranga Reddy

article_65714259.webp
రేపు ​మాడుగులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

​మాడుగుల, జులై 17(విజయక్రాంతి): ఈ నెల 19వ తేదీన మాడుగుల మండలంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayana Reddy) విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.3.82 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు ఏఎంసి డైరెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ​ఎమ్మెల్యే పర్యటన వివరాలు: ​కొలుకులపల్లి (ఉదయం 9:00): సాగర్ హైవే వద్ద హైమాస్ట్ లైట్లు, బస్ షెల్టర్ ప్రారంభోత్సవం, రూ.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన,ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం. ​రాజీవ్‌నగర్ తండా రూ.5 లక్షల వ్యయంతో హైమాస్ట్ లైట్ ప్రారంభోత్సవం,ఎన్‌ఆర్‌ఈజీఎస్ సీసీ రోడ్డు పనుల శంకుస్థాపన,​నర్సాయిపల్లి (ఉదయం 10:30): రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవం; రూ.50 లక్షలతో సీసీ రోడ్డు పనుల శంకుస్థాపన.

17-07-2026

article_88738537.webp
సైబరాబాద్‌లో ఇన్‌స్పెక్ట‌ర్లు బదిలీ

శేరిలింగంపల్లి,జూలై 18 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో 55 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనాపరమైన కారణాలతో పలు పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్, ప్రత్యేక విభాగాల్లో మార్పులు చేపట్టారు.బదిలీల్లో భాగంగా కూకట్‌పల్లి ఎస్‌హెచ్‌వోగా డి. స్వామిగౌడ్, మధాపూర్ ఎస్‌హెచ్‌వోగా కె.వి. సుబ్బారావు, మియాపూర్ ఎస్‌హెచ్‌వోగా ఎన్. జయరాం, బాలానగర్ ఎస్‌హెచ్‌వోగా జి. ప్రశాంత్, చందానగర్ ఎస్‌హెచ్‌వోగా ఎ.ఆర్.ఇ. శ్రీధర్, రాయదుర్గం ఎస్‌హెచ్‌వోగా ఎన్. శ్రీనివాస్, గచ్చిబౌలి ఎస్‌హెచ్‌వోగా కె. సైదులు, ఆర్‌సీపురం ఎస్‌హెచ్‌వోగా ఎం. రాజేష్, పటాన్‌చెరు ఎస్‌హెచ్‌వోగా ఎం. రవీందర్‌ను నియమించారు.బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని, సంబంధిత డీసీపీలు రిలీవింగ్, జాయినింగ్ ప్రక్రియ పూర్తి చేసి వివరాలను కమిషనరేట్‌కు పంపించాలని ఆదేశించారు. శాఖలో సమర్థవంతమైన పరిపాలన,పనితీరు మెరుగుపర్చడమే ఈ బదిలీల లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు

17-07-2026