ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి
బెల్లంపల్లి: వివిధ అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం సాయంత్రం బెల్లంపల్లి మండల కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల విలువలు, రిజిస్టర్లు, ల్యాబ్, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణుల వివరాలు, పరిసరాలను పరిశీలించారు.
16-07-2026