calender_icon.png 4 February, 2026 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_81276164.webp
ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

03-02-2026

మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 2: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 20 (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు) కళాశాలల్లో రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. మొదటి విడత ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు 1279 (జనరల్ 604, ఒకేషనల్ 675) మంది విద్యార్థులకు 1161 (జనరల్ 589, ఒకేషనల్ 572) మంది హాజరు కాగా 118 (జనరల్ 15, ఒకేషనల్ 118) మంది గైర్హాజరయ్యారని, రెండవ విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలకు 1099 (జనరల్ 537, ఒకేషనల్ 562) మంది విద్యార్థులకు 1047 (జనరల్ 516, ఒకేషనల్ 531) మంది హాజరు కాగా 52 (జనరల్ 21, ఒకేషనల్ 31) మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, పరీక్షల కన్వీనర్ అంజయ్య వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను డీఐఈఓ తనిఖీ చేశారు.

article_79122633.webp
విత్ డ్రాల కోసం బేరసారాలు

02-02-2026

మంచిర్యాల, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. స్క్రూటినీ అనం తరం అభ్యర్థులందరు వార్డుల వారిగా ఎంత మంది బరిలో ఉన్నారు, ఆయా పార్టీల నుం చి ఎంత మంది నామినేషన్లు వేశారు, ఇందు లో పార్టీ బీ ఫారంలు సమర్పించిన వారెందరు, ఇంకా ఎంత మందికి బీ ఫారంలు కావాలి, వారంతా ఇండిపెండెంట్లుగా బరిలో నిలబడితే వార్డులో ఏ కాలనీలోని ఎన్ని ఓట్లు చీల్చుతారు, వారిని తమవైపు తిప్పుకుంటే ఎన్ని ఓట్లు ప్లస్ అవుతాయని అభ్యర్థు లు అంఛనాలు వేయడంతో పాటు సొంత పార్టీలో రెబల్ లను విత్ డ్రా చేయించేందుకు వారి దగ్గరి బంధువులతో, స్నేహితుల తో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చుతో పాటు అదనంగా ఫలానా వరకు ఇస్తామని రాయబారాలు నడిపిస్తున్నారు.

article_56580451.webp
ముగిసిన నామినేషన్ ల జాతర

31-01-2026

మంచిర్యాల, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలకు నామినేషన్లు ఊపందుకున్నాయి. మొదటి రోజు 35 నామినేషన్లు, రెండవ రోజు 339 నామినేషన్లు, మూడవ రోజు 1225 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో మంచిర్యాల కార్పొరేషన్ లోని 60 డివిజన్లకు 615 నామినేషన్లు దాఖలు కాగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు 361, చెన్నూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు 225 నామినేషన్లు, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డులకు 241 నామినేషన్లు, లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 15 వార్డులకు 157 నామినేషన్లు దాఖలయ్యాయి. బీ ఫారాలు సమర్పించేందుకు ఫిబ్రవరి మూడవ తేదీ వరకు సమయం ఉండటంతో ఆయా పార్టీలు బీ ఫారాలు అందజేసిన అనంతరం పార్టీ గుర్తులపై పోటీలో ఎంత మంది ఉంటారో, స్వతంత్ర అభ్యర్థులుగా ఎంత మంది బరిలో ఉంటారో తేలనుంది.

article_42596599.webp
కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించండి

31-01-2026

మంచిర్యాల, జనవరి 30(విజయక్రాంతి): మంచిర్యాల నియోజక వర్గంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని చూసి కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు కోరారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని 60 డివిజన్ల అభ్యర్థులతో మంచిర్యా లలోని తన నివాసంలో, లక్షెట్టిపేట మున్సిపాలిటి పరిధిలోని 15 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థు లతో ఇటిక్యాలలోని శ్రీనివాస గార్డెన్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో మంచిర్యాల నియోజకవర్గంలో చేసిన అభివృద్దిని వివరించారు.

article_74902377.webp
చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు

31-01-2026

మంచిర్యాల/లక్షెట్టిపేట టౌన్, జనవరి 30 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని మం చిర్యాల కార్పొరేషన్ తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలకు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ఇది వరకే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కొన్ని వార్డులలో అభ్యర్థులను ఎంపిక చేసి బీ ఫాంలు అందివ్వగా మరి కొన్ని డివిజన్లు, వార్డులకు ఇంత వరకు అభ్యర్థుల ఎంపి క చేయకపోవడంతో ఎవరికి వస్తుందోనని తెలియక చాలా మంది అభ్యర్థులు ఆశతో నామినేషన్లు వేశారు. టికెట్లు ఆశించి భంగపడ్డ వారిలో కొంత మంది ఇతర పార్టీల్లో చేరుతుండగా, మరి కొంత మంది ఇండిపెండెంటుగా పోటీ చేసేందుకు వెనుకాడకుండా నామినేషన్లు దాఖలు చేశారు.