calender_icon.png 4 February, 2026 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_77254667.webp
బీఆర్‌ఎస్‌దే చేర్యాల మున్సిపల్ పీఠం

04-02-2026

చేర్యాల, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం చేర్యాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్, సీపీఎం నాయకలతో కలిసి మున్సిపల్ పరిధిలోని 1,2,10,11,12 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను కలిశారు.మిత్రపక్షమైన సీపీఎంకి 3వ వార్డు కేటాయించగా ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సీపీఎం నాయకులతో ఆయన ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు,సంక్షేమ పథకాలను వివరిస్తూ గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభు త్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఆయన ఓట్ల ను అభ్యర్థించారు.

article_55703853.webp
సిద్దిపేట జిల్లాలో వేడెక్కుతున్న మున్సిపల్ ఎన్నికలు

03-02-2026

సిద్దిపేట, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్, గ జ్వేల్, చేర్యాల, దుబ్బాక మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి రోజురోజుకు ఉద్ధృతంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్ర చారాన్ని మరింత వేగవంతం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమ య్యాయి. ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్థులు తమ హామీలను ప్ర జలకు వివరిస్తున్నారు. ప్రధాన పార్టీల ఆశీస్సులు తమకే ఉన్నాయని, పార్టీ నాకే బీ ఫామ్ ఇస్తుంది అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. సమస్యలనే ఎరగా చూ పుతూ పరిష్కారానికి నేనే కృషి చేస్తానం టూ, నా వల్లనే అభివృద్ధి జరుగుతుంది అ న్నట్టు వ్యక్తిగత హామీలు ఇస్తున్నారు. ఓటర్లను అకట్టుకునేందుకు అనేక విన్యాసాలకు పాల్పడుతున్నారు.

article_62688287.webp
ఎమ్మెల్యే పల్లా సహకారంతో అభివృద్ధికి పాటుపడతా

02-02-2026

చేర్యాల,ఫిబ్రవరి 1: చేర్యాల మునిసిపాలిటీలోని 10వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మెడిశెట్టి ఉమా శ్రీధర్ ఆదివారం ఆమె పట్టణంలోని 10వవార్డులో ఇం టింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కారు గుర్తు మీద ఓటు వేసి తనను గెలి పించాలని వార్డులోని ఓటర్ లను కలుస్తూ ఓటును అభ్యర్థించారు. వార్డులోని సమస్యలు తెలుసు కుంటూ వార్డును అన్ని విధాలుగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తాను అని వార్డును అన్ని విధాలుగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు.

article_38254681.webp
వైభవంగా సత్యసాయి ప్రేమ వాహిని రథ యాత్ర

02-02-2026

బెజ్జంకి, ఫిబ్రవరి 1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి (శతజ యంతి) ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర దేశవ్యాప్తంగా సాగుతోంది.జయంతి లో భా గంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర ఆదివారం బెజ్జంకి చేరుకోవటం జరి గింది. సత్యసాయి భక్తులు భజన మండలి ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతిలతో ఘనస్వాగతం పలికారు.మండలి సభ్యులు మాట్లాడుతూ శ్రీసత్యసాయి భగవానుని దివ్య వైభవాన్ని చాటుతూ పుట్టపర్తి నుండి బయలు దేరిన శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథం బెజ్జంకి చేరి గ్రామ వీధుల గుం డా తిరుగుచూ ప్రాంతాన్ని పావనం చేయ టం జరిగిందని తెలిపారు.