18 July, 2026 | 12:19 AM

Districts - Siddipet

article_70995839.webp
బాలికల విద్యే సమాజానికి అభివృద్ధి

చేర్యాల, జులై 17: చేర్యాల పట్టణంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి శుక్రవారం జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ కుమార్తెల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని బాలికల విద్య కుటుంబానికే కాదు,సమాజ అభివృద్ధికి కూడా బలమైన పునాది అని చదువే జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధం అని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల బాలికలు కూడా ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

17-07-2026

article_47824623.webp
కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన

గజ్వేల్, జులై17: కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా మేడిగడ్డ నుండి రిజర్వాయర్లలోకి నీటిని నింపి రైతులకు తాగునీరు అందించాలని బీఆర్ఎస్ శుక్రవారం కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో మాజీ రైతుబంధు రాష్ట్ర కమిటీ సభ్యులు దేవి రవీందర్, గజ్వేల్ మాజీ ఏఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ మాజీఎంపీపీలు, జడ్పిటిసిలు, మండల పార్టీల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు పంట సాగు చేయడానికి భయపడుతున్నారని, ఇప్పటికే వేసిన పంటలను పలువురు రైతులు మళ్లీ దున్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మేడిగడ్డ వద్ద కన్నేపల్లి పంప్ హౌస్ నుండి నీటిని మిగతా రిజర్వాయర్లకు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.

17-07-2026

article_69765517.webp
వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల,జులై 17: చేర్యాల మండలం ఆకునూర్ గ్రామంలో నిర్మించిన ఐదు స్వయం సహా యక బృందాల (వీఓ) భవనాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజే శ్వర్ రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతుమహిళల ఆర్థిక సాధికారత,స్వయం ఉపాధి,పొదుపు సంస్కృ తిని బలోపేతం చేయడంలో స్వయం సహాయక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది.గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపిం చడంలో స్వయం సహాయక బృందాల సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. మహిళల ఐక్యత, క్రమశిక్షణ, పొదుపు అలవాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.వీఓ భవనం అందుబాటులోకి రావడంతో స్వయం సహాయక బృందాల సమావేశాలు,శిక్షణా కార్యక్రమాలు,పొదుపు, రుణాల నిర్వహణతో పాటు ఇతర ఆర్థిక కార్యకలాపాలకు ఎంతో ఉపయో గకరంగా ఉంటుందని చెప్పారు.

17-07-2026

article_64567008.webp
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా

కొమురవెల్లి,(విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు ఎరువులను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కొమురవెల్లి మండల కేంద్రంలో గల ముదిరాజ్ సంఘం భవనంలో కేంద్ర వ్యవసాయ శాఖతో పాటు మత్స్యశాఖ సహకారంతో ఏర్పాటుచేసిన విత్తనాల, ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు. రైతులు తప్పనిసరి ప్రామాణిక విత్తనాలు, నాణ్యమైన ఎరువులను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రైతులకు అవసరమైన సేవలు అందించడంలో ఇలాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ ప్రతినిధులు, ముదిరాజ్ సంఘ సభ్యులు స్థానిక సర్పంచ్ పద్మాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

17-07-2026