calender_icon.png 30 March, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_38234791.webp
మత సామరస్యానికి ప్రతీక రంజాన్

29-03-2025

హనుమకొండ, మార్చి 28 (విజయ క్రాంతి): మనలో సోదర భావాన్ని పెంపొందించే ఇఫ్తార్ విందు దోహదం చేస్తుంది.పవిత్ర రంజాన్ మాసాంతం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత,మతసామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజిపేట లోని జామా మస్జిద్, పారడైజ్ ఫంక్షన్ హాల్ లో కార్పోరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని,మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనతరం ముస్లిం సోదరులకు అడ్వాన్సు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుసృ పాషా, మీర్జా అజీజుల్లా బేగ్, సయ్యద్ రజాలి, సుంచు అశోక్, అబు బాకర్, మొహమ్మద్ యూనస్, తహశీల్దార్ బావు సింగ్ పాల్గొన్నారు.

article_80216780.webp
బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

29-03-2025

హనుమకొండ, మార్చి 28 (విజయక్రాంతి): మాజీ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను సాకారం చేసింది టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పార్టీ ఒకే ఒక్కడిగా మొదలైన కేసీఆర్ తెలంగాణ కోసం తెగించి కొట్లాడారు. త్యాగాలు పోరాటాల ద్వారా తెలంగాణను సాధించిన నేత కేసీఆర్ 25 ఏండ్ల పాటు ప్రజల ఆకాంక్షల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ పని చేసింది. 14 ఏండ్ల పాటు తెలంగాణ కోసం కొట్లాడం,10 ఏండ్ల పాటు కేసీఆర్ నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన తెలంగాణను దేశంలోనే ప్రధమంగా నిలిపారు.దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిన నాయకుడు కేసీఆర్. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల అభిష్టం మేరకు పని చేశారు.

article_13577198.webp
ముస్లింలకు అండగా ప్రజా ప్రభుత్వం

26-03-2025

హనుమకొండ, మార్చి 25 (విజయ క్రాంతి): మంగళవారం రోజున హాసన్ పర్తి మండల పరిధిలోని KLN ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన దావత్ - ఏ - ఇఫ్తార్ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, హనుమకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి లతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే ఉపవాసాల అసలు ఉద్దేశ్యం అన్నారు. తమ జీవిత సౌదాల్ని సత్యం, న్యాయం, ధర్మం అనే పునాదుల మీద నిర్మింపజేసుకునేందుకు ఉపయోగపడే సాధనమే ఉపవాస వ్రతం అన్నారు.