12 July, 2026 | 5:35 PM

Breaking News

పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •   జగన్నాథ రథయాత్రను విజయవంతం చేద్దాం   •  

క్యాన్సర్ భయపడాల్సిన వ్యాధి కాదు

05-02-2026 12:42 AM

ఎల్బీనగర్‌లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా 5కే వాకథాన్ 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 4 : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్లోని గ్లెసిగల్స్ అవేర్ హాస్పిటల్ (ఫోర్టిస్ నెట్వర్క్ హాస్పిటల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి పర్యవేక్షణలో 5కే వాకథాన్ నిర్వహించారు. బుధవారం జరిగిన ర్యాలీని లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... 2008 ఫిబ్రవరి 4న ప్యారిస్లో జరిగిన ప్రపంచ క్యాన్సర్ వ్యతిరేక సదస్సులో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారని గుర్తుచేశారు.

క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధితో కలిగే మరణాల రేటును తగ్గించడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంకాలజిస్ట్ డాక్టర్ బిందురెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హేమంత్ పరిగల, గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, గ్లెనెగల్స్ అవేర్ హాస్పిటల్ క్లస్టర్ సీఈవో శ్రీ భరత్ కాంత్ రెడ్డి, వైద్యులు, నర్సులు, సమీప నివాసితులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.