కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఉప్పల్లో బీఆర్ఎస్ భారీ ధర్నా
ఉప్పల్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన, అమలు కాని ఎన్నికల హామీలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎక్స్రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గాడిదలతో వినూత్న నిరసన చేపట్టి, 420 అడుగుల భారీ బ్యానర్ను ప్రదర్శించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
02-09-2026 | 07:24pm