పేదల ఆకలి తీర్చనున్న సన్న బియ్యం
30-03-2025
మేడ్చల్, మార్చి 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినందున, జిల్లా యం త్రాంగం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉగాది రోజున ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తుండగా, ఏప్రిల్ కోటాలో రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం అందనున్నాయి.