3 September, 2026 | 1:07 PM

Districts - Medchal Malkajgiri

article_11963341.webp
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఉప్పల్‌లో బీఆర్‌ఎస్ భారీ ధర్నా

ఉప్పల్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన, అమలు కాని ఎన్నికల హామీలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎక్స్‌రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గాడిదలతో వినూత్న నిరసన చేపట్టి, 420 అడుగుల భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

02-09-2026 | 07:24pm

article_88713903.webp
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

మేడ్చల్, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. బీఆర్‌ఎస్ పిలుపుమేరకు శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై నిరసన చేపట్టి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు అధ్యక్షుడు అయ్యన్నగారి రవికిరణ్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ రామిడి మధుకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని, మహిళలకు నెలకు రూ.2,500 హామీని అమలు చేయలేదని ఆరోపించారు. రైతుబంధు, రైతుబీమా అమలుతో పాటు యూరియా సరఫరా, పంటల కొనుగోలులోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు.

02-09-2026 | 03:29pm

article_81947304.webp
బస్తీ దవాఖానాలలో వెంటనే వైద్యులను నియమించాలని కలెక్టర్ కు వినతి

ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని ఎన్ ఎఫ్ సి నగర్, బాలాజీ నగర్ బస్తీ దవాఖానాలలో వెంటనే వైద్యులను నియమించి, పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి లో వినతి పత్రాన్ని అందజేశారు.బస్తీ దవాఖానాలలో ప్రస్తుతం వైద్యులు ఎవరూ అందుబాటులో లేరని, వందలాది మంది రోజువారీ కూలీలు, అల్పాదాయ కుటుంబాలు, స్థానిక నివాసితులు తమ రోజువారీ వైద్య అవసరాలు, అత్యవసర ప్రాథమిక చికిత్స కోసం పూర్తిగా ఈరెండు ఆరోగ్య కేంద్రాలపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు.

31-08-2026 | 11:57pm