calender_icon.png 30 March, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_61325499.webp
కొడంగల్ నాకు రాష్ట్రాన్ని పాలించే శక్తినిచ్చింది

30-03-2025

వికారాబాద్, మార్చి 29: కొడంగల్ ప్రజలు తనకు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే శక్తిని ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్‌లో ఆయన పర్యటించారు. కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ 45వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. స్వామివారికి సీఎం రేవంత్‌రెడ్డి శేషవస్త్రాలు సమర్పించారు. సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందనే దు:ఖం ఉండొచ్చని, వాళ్లను పట్టించుకోవద్దని అన్నారు.

article_41770661.webp
మోకిలా పీఎస్‌కు జీవన్‌రెడ్డి

29-03-2025

చేవెళ్ల, మార్చి 28: భూకబ్జా కేసు విషయంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామా బాద్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి శుక్రవారం మోకిలా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. శంకర్‌పల్లి మండలం టంగుటూరు, చేవెళ్ల మండలం ఈర్లపల్లిలో భూవివాదానికి సంబంధించి జీ వన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై మోకిలా, చేవెళ్ల పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో వాదనలు ముగియగా జడ్జి తీర్పు రిజర్వ్ చేశారు. జీవన్‌రెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, పోలీసుల విచారణ ఆపాలని అప్పీల్ చేసుకున్నారు. దీన్ని హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన సర్వోన్నత న్యాయ స్థానం అతన్ని అ రెస్ట్ చేయవద్దని ఆర్డర్ ఇచ్చింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం మోకిలా పీఎస్‌కు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు సుప్రీం ఇచ్చిన ఆర్డర్‌ను వారికి సమర్పించారు.

article_44982077.webp
భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం

26-03-2025

వికారాబాద్, మార్చ్-25: పారిశ్రామిక పార్క్ కు భూములను ఇచ్చేందుకు సమ్మతి తెలిపిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.మంగళవారo కలెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన దుద్యాల మండలం హకీం పెట కు సంబంధించి 114 మంది రైతులతో సంప్రదింపులు కార్యక్రమము నిర్వహించారు .ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హకీం పెట్ గ్రామం లో మొత్తం పట్టా భూమి 146 .34 గుం టల భూమి ఉందని, స్వచ్చందంగా ముందు కు వచ్చిన రైతులతో అగ్రిమెంటు తీసుకొని ముందుకు వేళతామన్నారు. జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ నిర్ణయం ప్రకారము అవార్డు, చెక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందన్నా రు. సమ్మతి అవార్డు పొందిన రైతులకు ఒకే విడత లో చెక్కుల ద్వారా నష్ట పరిహారాన్ని చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎకరానికి 20 లక్షలు, 150 గజా ల ఇంటి స్థలములో ఇందిరమ్మ ఇల్లు, అర్హత మేరకు ఇంటికి ఒక ఉద్యోగం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

article_74955980.webp
పదవతరగతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు

21-03-2025

అనంతగిరి: మండల పరిధిలోని త్రిపురవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Tripuravaram Zilla Parishad High School)లో పదోవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద శుక్రవారం విద్యార్థుల సందడి నెలకొన్నది.వివిధ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మొత్తం137 మంది హాజరయ్యారు పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.పరీక్ష కేంద్రాన్ని మండల విద్యాధికారి తల్లాడ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. పోలీస్ శాఖ బందోబస్తు(Police department security) నడుమ పరీక్షలు ప్రారంభమయ్యాయి.పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఆరుబయట చెట్ల నీడలో సందడి నెలకొన్నది.