3 September, 2026 | 1:07 PM

Districts - Yadadri Bhuvanagiri

article_53842833.webp
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్‌లో నిర్వహిస్తున్న ధర్నాకు ఆలేరు నుంచి సీపీఎం నాయకులు తరలివెళ్లారు. జిల్లాలో అనేక నీటి వనరులు ఉన్నప్పటికీ వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు సాగునీరు అందించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఆలేరు ప్రాంతానికి సాగునీరు అందించే గంధమల్ల రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, రెండున్నర సంవత్సరాలు గడిచినా ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదని ఆరోపించారు.

31-08-2026 | 09:31pm