calender_icon.png 4 February, 2026 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_48707915.webp
ఆలేరు పీఠం అధిరోహించేదెవరో?

04-02-2026

ఆలేరు, ఫిబ్రవరి 3 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మున్సిపాలిటీలో రెండవ సాధారణ ఎన్నికలలో చైర్మన్ పీఠం ఎవరిని వరించనున్నదోనన్న చర్చ వేడివేడిగా జరుగుతున్నది. మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడనున్నాయి. రిజర్వేషన్ వివరాలు బీసీ మహిళగా ప్రకటించడంతో ఆశావాహుల్లో ఉత్కంఠత నెలకొంది. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో మొత్తం 13,632 ఓట్లర్లు ఉన్నారు. వీరిలో 6,671 పురుషులు, 6,960 మహిళలు, ఇతరులు ఒక్కరు ఉన్నారు. చైర్మన్ పీఠంపై అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు కూడా కన్నేసినట్టు తెలుస్తోంది. దీంతో పీఠంపై కూర్చునే బీసీ మహిళ ఎవరనేది ఉత్కంఠగా మారిపోయింది.

article_71468217.webp
మద్యం నియంత్రణపై అవగాహన ర్యాలీ

29-01-2026

సంస్థాన్ నారాయణపూర్,జనవరి 29(విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండలం గంగమూల తండాలో మద్యం నియంత్రణపై అవగాహన ర్యాలీ సర్పంచ్ కరంటోత్ లచ్చు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేపట్టిన మహా యజ్ఞానికి తామంతా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆయన కోరుకున్న మధ్యరహిత గ్రామంలో గంగమూల తండా మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అందరి ఆరోగ్యం కోసం తీసుకున్నాడని దానికి అందరం కట్టుబడి ఉండాలని కోరారు.యువత మద్యానికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడి చిద్రమై పోతున్నాయని అందుకే వారి జీవితాలను బాగుచేయాలనే సదుద్దేశంతో మద్యం నియంత్రణ చేపట్టారని అన్నారు.గ్రామస్తులంతా సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువత,మహిళలు పాల్గొన్నారు.

article_28388576.webp
దూలుగొండ తల్లి జాతర కరపత్రాల ఆవిష్కరణ

27-01-2026

గుండాల, (విజయక్రాంతి): మండల పరిధిలోని రోళ్లగడ్డ గ్రామంలో ప్రతీ యేటా దూలుగొండ తల్లి జాతరను అంగరంగ వైభవంగా ఈసం వంశీయులు నిర్వహిస్తారు. ప్రతీ సంవత్సరం హోళి పున్నమిలో బుధ, గురు, శుక్రవారాలలో మా కుల దేవత దూలుగొండ తల్లిని కొలుస్తూ వస్తున్నామని, ఈ సంవత్సరం కూడా మార్చి 04, 05, 06 తేదీలలో వచ్చే బుధ, గురు, శుక్రవారాలలో మూడు రోజుల పాటు ఈ జాతరను కన్నుల పండువగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతరకు సంబంధించిన కరపత్రాలను ఈసం కృష్ణ(టీచర్), ఈసం సారయ్య(ప్రొఫెసర్), డిస్కో వెంకన్న(టీచర్)లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈసం వంశీయులు పాపారావు, కృష్ణ, ఉదయ్, కార్తీక్, చంద్రశేఖర్, పాణి, హరికృష్ణ, రాజేష్, వడ్డెలు ప్రభాకర్, వసంత రావు తదితరులు పాల్గొన్నారు.