calender_icon.png 30 March, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_62856798.webp
జై బాపు, జై భీమ్ సంవిధాన్ నినాదాలతో ప్రజల్లో మమేకమవుదాం

24-03-2025

యాదాద్రి భువనగిరి మార్చి 23 ( విజయ కాంతి ): జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాలతో ప్రజల్లో మమేకమవుదామని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి అధ్యక్షతన యాదగిరిగుట్టలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర పిసిసి కోఆర్డినేటర్, జై బాపు జై భీమ్ కార్యక్రమాల ఆలేరు, బోనగిరి నియోజకవర్గాల ఇంచార్జ్ సంధ్యారెడ్డి లతో కలిసి ఎంపీ పాల్గొని ప్రసంగించారు.

article_26602385.webp
బీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్‌ను కలిసిన జిల్లా నేతలు

22-03-2025

యాదాద్రి భువనగిరి మార్చి 21 ( విజయ క్రాంతి ): బి.ఆర్.ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సన్నాహక సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో బి.ఆర్.ఎస్ అధినేత, కెసిఆర్ ను మాజీ మంత్రి , ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి (భువనగిరి ), గ్యాదరి కిషోర్ కుమార్ (తుంగతుర్తి ), గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి (ఆలేరు ) శుక్రవారం ఎర్రవెల్లి లోని వారి నివాసంలో కలిశారు . ఈ సందర్భంగా పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ , వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై పార్టీ అధినేత నాలుగు నియోజక వర్గాల నాయకులకు దిశా నిర్దేశం చేశారు. త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిగతా ఎనిమిది నియోజకవర్గాల ముఖ్యనాయకులతో సమావేశం ఉంటుందని పార్టీ అధినేత వెల్లడించినట్లు తెలిపారు.

article_60038102.webp
నిరుద్యోగులకు గొప్ప వరం రాజీవ్ యువ వికాస పథకం

22-03-2025

యాదాద్రి భువనగిరి మార్చి 21 ( విజయ క్రాంతి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువత కోసం ఏర్పాటుచేసిన రాజీవ్ యువ వికాస పథకం నిరుద్యోగులకు గొప్ప వరం అని మున్సిపల్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్రె జహంగీర్ అన్నారు. రాజీవ్ యువ వికాసం కింద ఏర్పాటుచేసిన దరఖాస్తు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ కుల మతాలకతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు కట్టుబడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.