22 April, 2026 | 1:09 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

Districts - Yadadri Bhuvanagiri

article_37179170.webp
మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని గుండాల, కాచనపల్లి, చెట్టుపల్లి గ్రామాల్లో ప్రాథమిక సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా నాయకులు, గుండాల సర్పంచ్ కొమరం సీతా రాములు, పూనెం రంగయ్య లు మాట్లాడుతూ.. మండలం వ్యాప్తంగా దరిదాపు 40 శాతం మంది రైతులు యాసంగి మొక్కజొన్నలు పండించారని, ప్రభుత్వం మద్దతు ధర 2400 ఉండగా బయట వ్యాపారస్తులు 1700 కి కొనుగోలు చేస్తున్నారని, ఎంతో కష్టపడి పంట పండిస్తే రైతులకు కనీసం పెట్టుబడి కూడా రావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

18-04-2026