కాంగ్రెస్ హామీలను విస్మరించింది: భిక్షమయ్య గౌడ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, రైతు కూలీలకు రూ.12,500, పింఛన్ల పెంపు, పూర్తిస్థాయి రుణమాఫీ వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూరియా, డీఏపీ కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు.
01-09-2026 | 09:31pm