22 April, 2026 | 3:06 PM

Breaking News

ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్వాకం.!   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే... హైకోర్టు తీర్పుపై కిషన్ రెడ్డి స్పందన   •   చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల డిమాండ్   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •  

Districts - Suryapet

article_40951530.webp
గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

హుజూర్ నగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర పౌరసరఫరాల,నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లక్ష్మీ నరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్ వ్యవస్థాపకులు, గంజి చంద్రమౌళి మృతి పట్ల మంత్రి ఉత్తమ్ సంతాపం వ్యక్తం చేశారు. గంజి చంద్రమౌళి నా చిరకాల మిత్రుడు, ఆప్తుడు, శ్రేయోభిలాషి అని అతని మృతి చాలా బాధాకరమని తెలిపారు.వారి కుటుంబానికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ,తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. లక్ష్మీ నరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్ ను స్థాపించిన చంద్రమౌళి ఈ ప్రాంత ప్రజల మనసును చురుగొని, అనతి కాలములోనే ప్రజల మన్ననలు పొందారని,కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేయడం కోసం నిస్వార్ధంగా పనిచేసిన వ్యక్తి అని మంత్రి కొనియాడారు.

22-04-2026