2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం
సూర్యాపేట, మార్చి 20 (విజయక్రాంతి): 2027 జనాభా లెక్కలు దేశ అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు కీలకమని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జిల్లాలో జనాభా గణన-2027ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి సెక్షన్ క్లర్క్ లు, టెక్నికల్ అసిస్టెంట్లకు మార్చి 20, 22, 23 తేదీలలో మూడు రోజుల పాటు ఇళ్ల జాబితా, గృహ గణన శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రారంభించారు.
21-03-2026