calender_icon.png 4 February, 2026 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_90530633.webp
మూడు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం

04-02-2026

కోదాడ, ఫిబ్రవరి 3: కోదాడ మునిసిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 11, 21, 31 వార్డుల కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన దేవరపల్లి మల్లేశ్వరి, కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్, ఎర్నేని కుసుమ బాబులు ఏకగ్రీవమైనట్లు కమిషనర్ రమాదేవి మంగళవారం తెలిపారు. ఆయా వార్డుల నుంచి మిగతవారు నామినేషన్ల ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచినవారు ఏకగ్రీవమయ్యారు. కాంగ్రెస్ పార్టీ మూడు కౌన్సిలర్ స్థానాలకు ఏకగ్రీవం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం నెలకొన్నది. మిగతా వార్డుల్లో విజయదుందుభి మోగించాలని కాంగ్రెస్ శ్రేణులు ఉవ్విలూరుతున్నారు.

article_20742059.webp
గెలుపు గుర్రాలకే బీఆర్‌ఎస్ టికెట్లు

04-02-2026

సూర్యాపేట, ఫిబ్రవరి 03 (విజయక్రాంతి): సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలుపు గుర్రాలకే టికెట్లను కేటాయించినట్లు మాట్లాడిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అన్ని వార్డుల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసిన అనంతరం మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీట్ల ఎంపికలో అందరికీ సమన్యాయం జరిగేలా చేశామన్నారు. అందుకు సహకరించిన మాజీ మున్సిపల్ చైర్మన్లకు సీనియర్లకు, ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు తగిన బుద్ది చెప్పేందుకు పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. తమ హయాంలో మహానగరాలకు దీటుగా సూర్యాపేటను తీర్చిదిద్దామన్నారు. పరిశుభ్రంగా ఉన్న పట్టణాన్ని రెండేళ్లలో ఆగం చేశారన్నారు.