బీజేపీ సోషల్ మీడియా ఇన్చార్జిగా రతన్ నోముల
27-01-2026
వరంగల్, జనవరి 26: బీజేపీ వరంగల్ జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జిగా రతన్ నో ముల సోమవారం బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అధ్యక్షతన, రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షం లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలు, కా ర్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోష ల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం రతన్ నోముల గారికి ఉందని తెలిపారు.రతన్ నోముల మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత ను అప్పగించిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.