22 April, 2026 | 3:05 PM

Breaking News

ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్వాకం.!   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే... హైకోర్టు తీర్పుపై కిషన్ రెడ్డి స్పందన   •   చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల డిమాండ్   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •  

Districts - Warangal

article_85669230.webp
“నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన

వరంగల్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): ప్రజాపాలన–ప్రగతి కార్యాచరణలో భాగంగా జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో పెట్రోల్ బంక్ యజమానులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయడానికి “నో హెల్మెట్- నో పెట్రోల్” అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని పెట్రోల్ బంక్ యజమాన్యాన్ని ఆదేశించారు.పెట్రోల్ బంకులకు వచ్చే వాహనదారులకు హెల్మెట్ అవసరంపై అవగాహన కల్పించాలని, నియమాలు పాటించే వారిని ప్రోత్సహించాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని, ప్రజల్లో భద్రతపై చైతన్యం పెంచడంలో పెట్రోల్ బంక్ యజమానులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

18-04-2026