calender_icon.png 4 February, 2026 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_46853471.webp
నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిన ప్రభుత్వ గ్రంథాలయం

03-02-2026

శ్రీరంగాపురం ఫిబ్రవరి 2: మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ గ్రంథాలయం శిథిలావస్థకు చేరి ప్రజల ఆందోళనకు కారణమవుతోంది. విద్యా, సాంస్కృతిక అభివృద్ధికి కీలకమైన ఈ గ్రం థాలయం ప్రస్తుతం సరైన నిర్వహణ లేకుండా దయనీయ స్థితిలో ఉంది. భవనం పైకప్పు చీలికలు పడి, గోడలపై చెదలు పట్టి వర్షాకాలంలో నీరు లోపలికి చేరుతోంది. పాత ఫర్నిచర్, చిరిగిన పుస్తకాలు, పనిచేయని ఫ్యాన్లు,లైట్లు పాఠకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.ప్రత్యేకంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రశాంత వాతావరణం లేక చదువుకు దూర మవుతున్నారు. గ్రంథాలయానికి వస్తే కూర్చోవడానికి సరైన కుర్చీలు కూడా లేవు. పుస్తకాలు పాడైపోతున్నాయి అని పలువురు విద్యార్థులు వాపోతున్నారు.

article_68835188.webp
ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి

03-02-2026

శ్రీరంగాపురం ఫిబ్రవరి 2: ట్రాక్టర్ రివర్స్ పడి వ్వక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివ రాల ప్రకారం మండల కేంద్రం లో తన స్వంత పోలంలో ట్రాక్టర్ పని చేస్తుండగా ఏదుట్ల శ్రీను (45) ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతునికి భార్య ఇద్దరు మగ పిల్లలు ఒక అమ్మాయి ఉన్నారు .గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

article_34778179.webp
పెబ్బేరు పట్టణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

02-02-2026

పెబ్బేరు పీబ్రవరి 1: పెబ్బేరు పట్టణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని జిల్లా అధికార ప్రతినిధి కంచి ఆంజనేయులు అన్నారు. ఆదివారంపట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. 10 మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. రెండో వార్డుకు గౌని శైలజ, 3లో గోనెల అరవింద్, 4లో దూపం సునిత, 5లో కంచె జ్యోతి, 6లో తిమ్మనగారి కృష్ణవేణి, 7లో గంధం శివ, 8లో రంగస్వామి గౌడ్, 9లో క్రాంతి కుమార్ నాయుడు, 10వ వార్డుకు మానపాడు రా ములు, 11వ వార్డుకు జీ. శ్వేతలను ఖరారు చేసినట్లు తెలిపారు.

article_49176203.webp
బస్తీ ప్రచారానికి భారీ స్పందన

02-02-2026

వనపర్తి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): పుర ఎన్నికలను పురస్కరించుకుని ఆదివారం వనపర్తి పట్టణంలోని 22 వ వార్డు, 6 వ వార్డుల్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మార్నింగ్ వర్క్ చేపట్టి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి తమ వార్డు కు వచ్చిన ఎమ్మెల్యేకు ఆయా వార్డులలోని మహిళలు, పెద్దలు యువకులు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించి 22 వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న చీర్ల సత్యం గారిని, 6 వ వార్డు లోనూ హస్తం గుర్తుపై తమ విలువైన ఓటును వేసి అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.

article_72190838.webp
ముగిసిన నామినేషన్ల పర్వం

31-01-2026

వనపర్తి,(విజయక్రాంతి): ఎప్పుడు ఎప్పుడా అని సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబందించి నోటిఫికేషన్ విడుదల కావడం నామినేషన్ల పర్వం సైతం ముగిసింది. అధికార, ప్రతిపక్షం పార్టీలో చాలా వార్డులో పార్టీ అభ్యర్థులకు ఫోటిగా స్వతంత్రులు నామినేషన్లు వేయడం తో వనపర్తి మున్సిపాలిటీ మొత్తం చర్చంచానీయంగా మారింది. తాము ఎప్పటి నుండో పార్టీ కి నమ్ముకుని ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి పార్టీ బలోపేతానికి కృషి చేశామని ఇంతలా కష్టపడ్డా ప్రజలకు సేవ చేసేందుకు గాను మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థి గా టికెట్ రాలేదని పార్టీలు గుర్తించక పోయిన మేము పడ్డ కష్టానికి ప్రజలందరూ తమ వెంట ఉన్నారని వారి మద్దత్తు తో నామినేషన్లు వేసి ఫోటి లో నిలబడి గెలుస్తామని ధీమా ను వ్యక్తం చేస్తున్నారు.