పెబ్బేరు పట్టణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
02-02-2026
పెబ్బేరు పీబ్రవరి 1: పెబ్బేరు పట్టణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని జిల్లా అధికార ప్రతినిధి కంచి ఆంజనేయులు అన్నారు. ఆదివారంపట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. 10 మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. రెండో వార్డుకు గౌని శైలజ, 3లో గోనెల అరవింద్, 4లో దూపం సునిత, 5లో కంచె జ్యోతి, 6లో తిమ్మనగారి కృష్ణవేణి, 7లో గంధం శివ, 8లో రంగస్వామి గౌడ్, 9లో క్రాంతి కుమార్ నాయుడు, 10వ వార్డుకు మానపాడు రా ములు, 11వ వార్డుకు జీ. శ్వేతలను ఖరారు చేసినట్లు తెలిపారు.