calender_icon.png 14 April, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_66429957.webp
వనపర్తి మున్సిపాలిటీ సిబ్బందికి అభినందన

10-04-2025

వనపర్తి టౌన్ ఏప్రిల్ 9: మున్సిపాలిటీ ఆదాయం పెంచడంలో శ్రమించిన సిబ్బంది జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి ఆదర్ష్ సురభి అభినందించారు.2023-24 లో రూ. 4.43 కోట్లు ఆస్తి పన్ను వసూలు కాగా, 2024-25 లో రూ.5.55 కోట్లు వసూళ్లు చేశారన్నారు.వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూలులో సిబ్బంది 2024-25 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పనితీరు కనబరిచారు. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 లో ఆస్తి పన్నులు రూపాయలు కోటికి పైగా అదనంగా వసూలు చేసి మున్సిపాలిటీ ఆదా యం పెంచారు. అదేవిధంగా నిర్దేశించిన లక్ష్యంలో 50.78% లక్ష్యాని సాధించగలిగారు అన్నారు.

article_30506233.webp
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధ్యాన్యాన్ని వెంటనే తూకం వేసి లోడ్ చేయాలి

10-04-2025

వనపర్తి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యంలో తేమశాతం నిర్దేశించిన స్థాయిలో వచ్చిన వెంటనే తూకం వేసి లోడ్ చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆదేశించారు బుధవారం కొత్తకోట మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యంలో తేమశాతం నిర్దేశించిన స్థాయిలో వచ్చిన వెంటనే తూకం వేసి లోడ్ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా టెంట్ వేసి, ఫ్లెక్సీ కట్టడంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు.

article_10154313.webp
రోడ్ల విస్తరణ పనులను వేగంగా పూర్తిచేయండి

10-04-2025

వనపర్తి టౌన్ ఏప్రిల్ 9: వనపర్తి జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో రహదారుల విస్తరణ పెండింగ్ పనులపై అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసి రెవెన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాల నుండి పెబ్బేరు రోడ్డు వైపు రహదారి, పానగల్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, సహా మిగతా పెండింగ్ రహదారుల విస్తరణకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు.

article_50817657.webp
స్వయం ఉపాధికి బాసట!

10-04-2025

వనపర్తి, ఏప్రిల్ 9 ( విజయక్రాంతి ) :నిరుద్యోగ యువత ఒకరిపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో ఎందుకు సాగా లన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకంతో సబ్సిడీ రుణాలను మంజూరు చేయడానికి సిద్ధమైంది. పి ఎస్ టి బి సి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రైతుపై అందించే రుణాల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణాల మంజూరు ప్రక్రియ అటకెక్కడంతో నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కరువైంది. రాష్ట్ర ప్రభు త్వ ఇటీవల తీసుకున్న రాజీవ్ యువ వికా సం పథకంతో మళ్లీ నిరుద్యోగ యువతీ యువకుల్లో ఆశలు చిగురించగా అయితే ఒ క్కో నియోజకవర్గానికి ఎన్ని యూనిట్లు మం జూరు చేస్తారన్న దానిపై స్పష్టత రాకపోవడంతో కాస్త అయోమయంలో నిరుద్యోగ యువతీ యువకులు పడ్డారు.