పట్టువీడని విక్రమార్కుల్లా పనిచేయాలి
వనపర్తి, మార్చి 22 (విజయక్రాంతి): ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజలకు, కార్యకర్తలకు వెన్నంటూ ఉంటూ పట్టు వీడని విక్రమార్కుల్లాగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి సూచించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పూర్తిస్థాయి కమిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి హాజరై పాల్గొన్నారు.
23-03-2026