తీరని విషాదం.. భోజనం చేస్తూ 'పొర' పోయి రైతు మృతి
తలకొండపల్లి,(విజయ క్రాంతి) కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాల్సిన ఆ సమయం ఆ ఇంట్లో తీరని శోకాన్ని నింపింది. ముద్ద నోట్లోకి వెళ్తే ప్రాణం నిలవాల్సింది పోయి, అదే ముద్ద ప్రాణం తీసిన ఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది.తలకొండపల్లి గ్రామానికి చెందిన ఉప్పనమోని ఇంద్రయ్య (42) వృత్తిరీత్యా రైతు. ఆదివారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ భోజనం చేస్తున్నాడు.
17-03-2026