26 May, 2026 | 11:42 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

Crime&legal -

article_13301339.webp
లింగాపూర్ గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులు

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామన్ని పోలీసులు చుట్టు ముట్టి సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు లింగాపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ పేరిట వందల మంది పోలీసులు ప్రవేశించారు. ఇంటింటా సోదాలు చేశారు. పోలీసుల సోదాలు గ్రామాలను భయపింకితులను చేశాయి. భూక్య రంజిత్, నివాసంలో అక్రమంగా కలిగి ఉన్న 20 లీటర్ల గుడుంబాను, బానోత్ వాగేష్, నివాసంలో 05 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1200 లీటర్ల గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం పానకం ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఇళ్లలో ఉన్న 30 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు 4 ట్రాలీల వాహన పత్రాలను తనిఖీ చేసి, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు.

26-05-2026

article_22084861.webp
యువతి అదృశ్యం.. కేసు నమోదు

కోనరావుపేట మే 25,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన భవాని భర్త బొజ్జ అనిల్ (25), ముదిరాజ్ కులానికి చెందిన యువతి ఈ నెల 23-05-2026 తేదీ ఉదయం 6 గంటల నుంచి ఇంటి నుండి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటనపై భవాని తండ్రి లాలా హనుమంతు సోమవారం కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని దరఖాస్తులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈమె ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే కోనరావుపేట పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

25-05-2026

article_11947289.webp
అనారోగ్య కారణాలతో మహిళ ఆత్మహత్య

హుజూర్ నగర్, (విజయక్రాంతి): అనారోగ్య కారణాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. హుజూర్ నగర్ యస్ఐ చలి కంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం... మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయినిగూడెం గ్రామానికి చెందిన దివ్వెల మహాలక్ష్మి (51) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో హాస్పిటల్ కు వెళ్లి చికిత్స తీసుకుంటున్న ఆరోగ్యం కుదుట పడటం లేదని తీవ్ర మనోవేదన చెంది శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తుండగా గ్రామ పోలిమేరలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని మృతురాలు భర్త దివ్వెల రవిజనార్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యస్ఐ విలేకరులకు తెలిపారు.

25-05-2026