22 April, 2026 | 1:20 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

Crime&legal -

article_72159384.webp
ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh State) ఒంగోలు గద్దలగుంటలో దారుణం చోటుచేసుకుంది. ఓ దరిద్రుడు నవమాసాలు మోసి పెంచిన కన్నతల్లినే కర్కశంగా కడతేర్చాడు. తల్లి బతికి ఉండగానే నిప్పు పెట్టాడు. మంగళవారం తెల్లవారుజామున తల్లి నిద్ర పోతుండగా నిందితుడు కిషోర్ ఇంటికి నిప్పుపెట్టాడు. తల్లి వెంకటరమణమ్మ మంటల్లో చిక్కిపోయి మాంసపు ముద్దలా మారింది. చుట్టుపక్కలవారు నిలదీయటంతో కిషోర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

14-04-2026