18 July, 2026 | 12:21 AM

Crime&legal -

article_52128367.webp
హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు

తుంగతుర్తి (విజయక్రాంతి):సూర్యాపేట పట్టణంలో డిఎస్పీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితురాలి అరెస్ట్ వివరాలు వెల్లడించిన సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్. తేదీ: 28.04.2026 రోజున తూర్పుగూడెం గ్రామంలో మృతి చెందిన కొణతం భాగ్యమ్మ మృతి పై అమే కూతురు ఉప్పు శోభారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుంగతుర్తి పోలీస్ వారు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని విచారణ చేయగా మృతురాలి యొక్క కోడలు అయిన కొణతం మధుర హత్య చేసినట్లు గుర్తించి నీ దుతురాలుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగినది అని సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపినారు.

17-07-2026

article_72095292.webp
హైవేపై బొలెరో–లారీ ఢీ: జెర్సీ ఆవులకు గాయాలు

చివ్వెంల, జూలై 17 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం సమీపంలోని నేషనల్ హైవే–365పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జెర్సీ ఆవులు గాయపడగా, డైరీ ఫార్మ్ యజమానికి కాలు విరిగింది. వివరాల ప్రకారం, జెర్సీ ఆవులను తరలిస్తున్న బొలెరో వాహనం (AP39WD9519) టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపారు. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ (AP39WN4189) బొలెరోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బొలెరోలో మొత్తం 5 జెర్సీ ఆవులు, 3 చిన్న దూడలు ఉండగా, వాటిలో 2 జెర్సీ ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌లోని ఓ డైరీ ఫారంకు వాటిని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో డైరీ ఫార్మ్ యజమానికి కాలు ఫ్రాక్చర్ కాగా, సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

17-07-2026

article_42124477.webp
ఘట్‌కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆ గ్రామాల్లో విషాదఛాయలు

పాపన్నపేట,జులై17: పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన కటికె రషీద్ తన సోదరుడు కటికె గౌస్, పాపన్నపేటకు చెందిన డ్రైవర్ రాములు ముగ్గురు తమ అశోక్ లేలెండ్ వాహనంలో ఎప్పటిలాగే గురువారం రాత్రి హైదరాబాదులో మేకలు, గొర్రెల వ్యాపారం చేసేందుకు వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కటికె రషీద్ (42) పాపన్నపేటకు చెందిన డ్రైవర్ రాములు (48) దుర్మరణం చెందారు. కటికె గౌస్ కు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తతో పాపన్న పేట, నార్సింగి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

17-07-2026

article_51487158.webp
సోనాల వైన్ షాప్ అర్ధరాత్రి లో దొంగతనం

బోథ్, జూలై 15 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని వైన్ షాపులో బుధవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది ఈ సంఘటనలో వైన్ షాప్ నుండి ఒక లక్ష 50 వేల రూపాయల విలువైన మద్యాన్ని ఎత్తుకెళ్లినట్లు తెలిసింది కాగా వైన్ షాప్ కు చెందిన రెండు సెక్టర్లను లను ధ్వంసం చేసి వైన్ షాప్ కు ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి మద్యం తీసుకు వెళ్లినట్లు నిర్వాహకులు అంటున్నారు. కాగా దొంగతనం జరిగిన విషయాన్ని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వడంతో ఉదయం పూట ఎస్సై పురుషోత్తం సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు జాగిలాలతో క్లూస్ టీం వారు పరిశీలించారు

15-07-2026

article_16448478.webp
కూతురి వివాహం విచ్ఛిన్నం కావడంతో కక్ష! మాదాపూర్‌లో వరంగల్ యువకుడి దారుణ హత్య

శేరిలింగంపల్లి,జూలై 15 (విజయక్రాంతి): హైదరాబాద్ ఐటీ హబ్(Hyderabad's IT hub) మాదాపూర్‌లో పాత కక్షలు రక్తపాతంగా ముగిశాయి. కూతురి దాంపత్య జీవితం విచ్ఛిన్నం కావడానికి తానే కారణమని భావించిన వ్యక్తులు, ఓ యువకుడిని హాస్టల్ వద్దకు పిలిచి కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. మంగళవారం రాత్రి అయ్యప్ప సొసైటీలో జరిగిన ఈ ఘాతుకం స్థానికులను తీవ్రంగా కలవరపెట్టింది.మృతుడు చిన్నపల్లి భాస్కర్ (30) వరంగల్ జిల్లా(Warangal District) మదన్నపేట్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ నగరంలోని అయ్యప్ప సొసైటీలో హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో తన స్వగ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.

15-07-2026

article_37707853.webp
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఏఆర్ కానిస్టేబుల్ మృతి

గజ్వేల్, (విజయ క్రాంతి): రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. మంగళవారం రాత్రి సుమారు 9.30 గంటలకు ప్రజ్ఞాపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న టీఎస్ 08 జేవీ 4810 వ్యాగనర్ కారు, పాతూరు రింగ్‌రోడ్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత పంక్చర్ షాప్ వద్ద ఆగి ఉన్న టీఎస్ 30 టీఏ 3579 లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఆరె కిరణ్, సిద్దిపేట ఏఆర్ కానిస్టేబుల్ (బకిల్ నెం.236), ప్రస్తుతం హైదరాబాద్ ఐఎస్‌డబ్ల్యూలో విధులు నిర్వహిస్తున్న ఆయన, తీవ్ర గాయాలతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

15-07-2026

article_80822652.webp
కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్

కల్లూరు,జూలై 14(విజయక్రాంతి): అక్రమ గంజాయి రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయి (విలువ రూ.1.50 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ హబీబ్,బొడ్డు చందు, తేజావత్ రమేష్‌లు ఒడిశా మల్కనగిరి నుంచి గంజాయి తెచ్చి విక్రయానికి సిద్ధమవుతుండగా,జూలై 13న షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో వాహన తనిఖీల్లో పట్టుబడ్డారు.ముగ్గురు నిందితులను సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.గంజాయి కొనుగోలు,రవాణా,విక్రయం నేరమని హెచ్చరించారు.ఎస్‌ఐ హరిత, హెడ్ కానిస్టేబుళ్లు నరసింహారావు,లక్ష్మీపతి, కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, సత్యనారాయణ,రఫీ,విజయ్, రంగారావు తదితరులు కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.

14-07-2026