26 May, 2026 | 11:41 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

Districts - Rajanna Sircilla

article_14410832.webp
రైతులకు జీలుగు విత్తనాల పంపిణీ

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం కొలనూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం రైతులకు జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సంకినేని రామ్మోహన్ రావు రైతులకు విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలనూర్ సొసైటీలో 300 జీలుగు బస్తాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రసాయన పెస్టిసైడ్ల వినియోగాన్ని తగ్గించి జీలుగు, జింకు వంటి పచ్చిరొట్టెల వినియోగాన్ని పెంచాలని రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జలగం అరవింద్ రావు, ఉపసర్పంచ్ బాబు, కొలనూర్ క్లస్టర్ ఏఈఓ హేమాజీ, సీఈఓ గాజుల రాజేశం, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

25-05-2026