Districts - Rajanna Sircilla

కరెంటు కోతలు - రైతుల అవస్థలు
కరెంటు కోతలు - రైతుల అవస్థలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో కరెంట్ కోతలతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు.గ్రామ రైతులంతా సర్పంచ్ చిగురు నరేష్ కు తమ సమస్యలు తెలిపారు. తరుచూ విద్యుత్ సమస్య ఏర్పడుతుందని ఇలాగైతే పంటలు ఎండి పోవడం జరుగుతుందని వరి పొట్టదశలో ఉందని ఈ సమయంలో నీటి వినియోగం ఎక్కువగా అవసరం ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక పెట్టుబడి పెట్టి నాట్లు వేశామని కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండి పోకుండా విద్యుత్ అధికారులకు మీ ద్వారా మా సమస్య తెలియజేసి నిరంతరం విద్యుత్ అందించేలా కృషి చేస్తూ రైతులను ఆదుకోవాలని సర్పంచ్ ను కోరారు.

13-09-2026 | 01:26am

దుర్గమ్మ ఆలయానికి సహకరించిన దాతకు సన్మానం
దుర్గమ్మ ఆలయానికి సహకరించిన దాతకు సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని దుర్గమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కి సహకరించిన దాతను ఘనంగా సన్మానించారు.చందుర్తి మండలం లింగంపేట గ్రామనికి చెందిన బిరేల్లి సుధాకర్ రావు.ఆయన కొడుకు భాస్కర్ రావు,బోర్ మోటార్ మరియు వాటర్ ట్యాంక్ దుర్గమ్మ ఆలయానికి అందించిన సందర్భంగా రామాంజనేయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంన్మానించారు.శనివారం రోజున సుధాకర్ రావు బోర్ మోటార్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.దుర్గమ్మ ఆలయం వద్ద నీటి సమస్య ఉందని చెప్పగానే సుధాకర్ రావు వెంటనే స్పందించి బోర్ మోటార్, వాటర్ ట్యాంక్ అందించినందుకు భక్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు

12-09-2026 | 12:52pm