గణపతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి
గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు.కోనరావుపేటలో వినాయక మండపాల నిర్వాహకులకు ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక అవగాహన కల్పించారు. పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
13-09-2026 | 12:00am