వేములవాడ అభివృద్ధిపై బీఆర్ఎస్ ధ్వజం.. చల్మెడ ఫైర్
04-02-2026
వేములవాడ,ఫిబ్రవరి 3,(విజయక్రాంతి): వేములవాడ మున్సిపల్ పరిధిలో కేసీఆర్ పాలనలో సుమారు రూ.300 కోట్ల అభివృద్ధి జరిగిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడి గే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉందని వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు అన్నారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గు డిచెరువు సుందరీకరణ, మిషన్ భగీరథ ద్వారా ఓవర్హెడ్ ట్యాంకులు, 9 వేల నల్లా కనెక్షన్లు, బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి, మిడ్ మానేరు నుంచి పైపులైన్, మున్సిపల్ పార్కు, శామకుంట రైతు మార్కెట్ నిర్మాణం వంటి పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని వివరించారు.