calender_icon.png 30 March, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Editorial

article_54791325.webp
అంత అసహనమైతే ఎలా?

30-03-2025

తెలంగాణలో ముఖ్యమంత్రి, ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జట్టు కట్టి ముగ్గు రు పాత్రికేయులను కారాగారానికి పంపిం ది. కోర్టు దిక్కు లేకపోతే, ఏ దిక్కూ ఉండ దు. హైదరాబాద్ న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత వారు విడుదలయ్యారు. మనకు ఏ విద్యా వద్దు, విమర్శ వద్దు. కవిత్వం వద్దు. వ్యంగ్యం వద్దు. మనకు కావలసింది భజన. సన్మానాలు. ఎందు కూ పనికి రాని శాలువలు. వేల రూపాయల పూలహారాలు. జైలుకు కారణం వా రు తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారట. ముఖ్యమంత్రికి నచ్చలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నచ్చదు. కోపం వచ్చింది కూడా. వారిని జైలకు పంపారు. పోలీసు లు ఫోన్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. వారి తిట్టు తీవ్రంగా ఘాటుగా న సాళానికి తగిలినట్టుంది. ఒక్క సంఘటన కాని బోలెడు కేసులు.

article_72736244.webp
భూకంప విలయాలు

29-03-2025

శుక్రవారం సంభవించిన భారీ భూకంపాల ధాటికి మయన్మార్, థాయిలాండ్ దేశాలు విలవిలలాడుతున్నాయి. కూలిన ఎత్తయిన భవనాల మధ్య చిక్కుకుని హాహాకారాలు చేస్తున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే వీరిలో ఎంతమంది ప్రాణాలతో బయటపడతారో అనుమానమే. క్షతగాత్రులను ఆదుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ముందుకు వచ్చింది. మయన్మార్‌లో ఒక్క రోజులోనే ఆరు సార్లు భూమి తీవ్రంగా సంభవించిందంటే భూకంపాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా మయన్మార్‌లో వచ్చిన భూకంపం అత్యంత శక్తివంత మైనదని అమెరికాలోని జాతీయ భూకంప సమాచార కేంద్రంలోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఇటుంటి భూకంపమే టర్కీ, సిరియాలో సంభవించగా భారీగా ప్రాణనష్టం సంభవించింది.

article_40560679.webp
యువతరానికి బంగారు భవిష్యత్తు

29-03-2025

ప్రపంచ జనాభా లెక్కల్లో మొదటి స్థానంలో ఉన్న భారతదేశంలో నిరుద్యోగ సమస్య ప్రమాదకరంగా మారుతున్నది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభు త్వం యువతలో వికాసం నింపే చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రై వేట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతూనే మరోవైపు యువత సొంత కాళ్లమీద నిలబడి వ్యాపారం చేస్తూ వారే మరికొందరికి ఉపాధి కల్పించేలా ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని యువతకు భారీగా స్వయంఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ పథకాన్ని తెచ్చిన ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న లబ్ధిదారులకు రుణాలను అందించనుంది.

article_70491011.webp
సహజ ఫలాలతో సంపూర్ణ ఆరోగ్యం

29-03-2025

కాలానుగుణంగా పండ్లు, కూరగా యలను తినడం మన ఆరోగ్యా నికి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. మన పూర్వీకులు ప్రాముఖ్యతనిచ్చింది స్థాని కంగా లభ్యమయ్యే తాజా, పోషక గుణాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలకే. అయితే, ఆధునిక సాంకేతికత, గ్లోబలైజేషన్ ప్రభా వంతో ఏ కాలానికైనా సంబంధం లేకుండా వివిధ దేశాల నుండి ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తున్నాయి. కాలానుగు ణంగా లభించే కూరగాయలు, పండ్లు తాజా గా, రుచిగా ఉండటమే కాకుండా పోషకప రంగా సమృద్ధిగా ఉంటాయి. అవి సహ జంగా పెరిగి, పూర్తిగా పక్వం చెందిన తర్వాతే కోయబడతాయి. కాబట్టి పోషకాలు, యాం టీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ అధికంగా ఉం టాయి. ఇవన్నీ శరీరానికి మేలు చేసే సహజ పోషకాలు.

article_54210555.webp
హడావిడి తీర్పులు!

28-03-2025

ఓ అత్యాచారం కేసు తీర్పు సందర్భంగా అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాచేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నెల 17న మిశ్రా ఈ తీర్పు ఇచ్చారు. మహిళల దుస్తులు పట్టుకుని లాగడం, ఛాతిని తాకడం అత్యాచార యత్నం కిందికి రాదంటూ తీర్పు సందర్భంగా మిశ్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవితో పాటుగా అన్ని వర్గాలకు చెందిన వాళ్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దాన్ని సరిచేయాలని కేంద్రమంత్రి కోరడంతో సుప్రీంకోర్టు గత బుధవారం దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. అలహాబాద్ జడ్జి తీర్పుపై స్టే విధించిన జస్టిస్ బీఆర్ గవాయ్.