calender_icon.png 31 March, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_48506040.webp
మాపైనే అధికారులకు ఫిర్యాదు చేస్తావా?

29-03-2025

జనగామ, మార్చి 28(విజయక్రాంతి): ఓ ఉద్యోగి పనితీరుపై కొందరు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయగా.. అది మనసులో పెట్టుకున్న సదరు ఉద్యోగి కుటుంబ సభ్యులు ఓ యువకుడిపై దాడికి తెగబడ్డారు. కుల సమావేశంలో సదరు యువ కుడు ఎదురుపడడంతో ఒక్కసారిగా తమపై ఫిర్యాదుచేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో శుక్రవారం జరిగింది. బాధితుడు, కులస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకిర్యాల గ్రామంలోని తపాలా కార్యాలయంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ కొన్ని రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన బీజేపీ యువ మోర్చా నాయకుడు నవీన్ కుమార్‌తో పాటు పలువురు యువకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

article_75814598.webp
రైతులను ఉగ్రవాదుల్లా చూస్తున్న కేంద్రం

29-03-2025

జనగామ, మార్చి 28(విజయక్రాంతి): ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై పంజాబ్ ప్రభుత్వం, ప్రధాని మోడీ చేస్తున్న దాడులు, నిర్బంధాలను వెంటనే ఆపాలని తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై చేసిన దాడులకు నిరసనగా జనగామ జిల్లా కేంద్రంలో చౌరస్తా వద్ద సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గతంలో దేశ రైతాంగానికి ఇచ్చిన రాత పూర్వక హామీలను అమలు చేయాలని రెండో దశ ఉద్యమం చేస్తున్న పంజాబ్, హర్యానా రైతులను సరిహద్దుల్లో నిలువరించి ఉగ్రవాదులపై ప్రయోగించే దాడులను చేయడం సరికాదన్నారు. శాంతియుతంగా ఆందోళనకు అవకాశం లేకుండా భాష్ప వాయువులు, టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎఫ్ జిల్లా బాధ్యులు కుర్ర రవీందర్ గౌడ్ , తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య, జిల్లా సహాయ కార్యదర్శి రామావత్ మీట్యా నాయక్ , పట్టణ అధ్యక్షుడు ఉర్సుల కుమార్, సీనియర్ నాయకులు మండ్రా బండయ్య, కర్రె సత్యనారాయణ, కర్రె సిద్దిమల్లయ్య, నీలం బాలరాజు, సులోచన, సోని పాల్గొన్నారు.

article_31591377.webp
అద్దె భవనం.. అరకొర వసతులు

27-03-2025

జనగామ, మార్చి 26: ఓ వైపు అద్దె భవనం.. మరో వైపు అరకొర వసతుల మధ్య తహసీల్దార్ కార్యాలయాన్ని నెట్టుకొస్తున్నారు. జనగామ మండలంలోని తరిగొప్పుల మండలంలో తహసీల్దార్ కార్యాలయానికి సొంత భవనం కల నెరవేరడం లేదు. దీంతో అసౌకర్యాల నడుమ సిబ్బంది పనిచేయాల్సి వస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం తరిగొప్పల నూతన మండలండగా ఏర్పడగా.. అప్పటి నుంచి కనీసం తహసీల్దార్ కార్యాలయానికి ప్రభుత్వం సొంత భవనం మంజూరు చేయలేదు. ఈ కార్యాలయానికి అనేక రెవెన్యూ సంబంధిత పనుల కోసం రోజుకు వందలాది మంది వస్తుంటారు. ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్లు ఇక్కడే జరగడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా ఇక్కడ వసతులు లేకపోవడంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

article_50280324.webp
భూమి వదులుకోకుంటే రౌడీషీట్ తెరుస్తా!

27-03-2025

జనగామ, మార్చి 26(విజయక్రాంతి): తమ భూమిని వదులుకోకుంటే రౌడీషీట్ తెరుస్తానని సీఐ బెదిరిస్తున్నాడని, న్యాయం కోసం వెళ్లిన తనపై ఇప్పటికే ఉల్టా పలు కేసులు బనాయించారని ఓ మహిళ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే అనుచరులకు వత్తాసు పలుకుతూ పోలీసు అధికారి సివిల్ తగాదాలో జోక్యం చేసుకుని తమపై బెదిరింపుకుల పాల్పడుతున్నారని సదరు మహిళ చెబుతోంది. ఆయన వేధింపులు తట్టుకోలేక మహిళా కమిషన్‌ను ఆశ్రయించినట్లు వెల్లడించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం రెడ్డిపురం గ్రామ శివారులో 126 సర్వే నంబరులో ఎకరా స్థలంపై రెండు పార్టీల మధ్య వివాదం నడిచింది. సదరు జాగా దుగ్లంపుడి టేకులమ్మ భర్త మల్ రెడ్డికి చెందినది కాగా కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించారు.

article_25009188.webp
బీమా రంగానికి ఏజెంట్లే వెన్నెముక

27-03-2025

జనగామ, మార్చి 26(విజయక్రాంతి): బీమా రంగానికి ఏజెంట్లే వెన్నెముక అని, వారికి నష్టం చేకూర్చేలా బీమా సంస్థలు తీసుకొచ్చిన మార్పులు సరికావని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన జీరో అవర్‌లో మాట్లాడారు. భారతదేశ బీమా రంగానికి వెన్నెముకగా నిలిచే ఈ ఏజెంట్లు, ఎల్‌ఐసీసీ రెగ్యులేటరీ అధికారులు విధించిన ఇటీవలి పాలసీ మార్పుల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. ఏజెంట్లకు మొదటి సంవత్సరం కమీషన్ 35 శాతం నుంచి 28 శాతానికి తగ్గించడం వల్ల వారి ఆదాయానికి గండి పడుతోందన్నారు.

article_23386945.webp
గుండెపోటుతో మృతిచెందిన ఫొటోగ్రాఫర్

26-03-2025

జనగామ, మార్చి 25(విజయక్రాంతి): గుండెపోటుతో మృతిచెందిన ఫొటోగ్రాఫర్ కుటుంబానికి జనగామ జిల్లా ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ రూ.20 వేల ఆర్థిక సాయం చేసింది. జనగామ పట్టణానికి చెందిన బంగారుగళ్ల రమేశ్ అనే ఫొటోగ్రాఫర్ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. అసోసియేషన్ నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబానికి రాష్ట్ర కమిటీ తరఫున రూ.10 వేలు, జిల్లా కమిటీ తరఫున 10 వేలు.. మొత్తంగా రూ.20 వేలు అందించారు. సీనియర్ ఫొటోగ్రాఫర్ వాడ్నిల లింగమూర్తి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వలబోజు శ్రీనివాస్ , జిల్లా గౌరవ అధ్యక్షుడు కాముని రాము, ఉడుగుల కృష్ణ, గణపురం ఉమేష్, ఎక్కల దేవి ఓంకార్ , కుందారం సాయి, శ్రవణ్ కుమార్, దశరథ్, శేఖర్, చందు, అనిల్ ఉన్నారు.