కలెక్టర్తో ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ భేటీ
31-01-2026
జనగామ, జనవరి 30 (విజయక్రాంతి): మున్సపిల్ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్ల పై వివరించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ అబ్జర్వర్గా నియమితులైన తెలంగాణ భాషా, సాంస్కృతి శాఖ డైరెక్టర్ ఎ. నర్సింహరెడ్డి (ఐ.ఏ.ఎస్.,) శుక్రవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తన ఛాంబర్లో భేటి అయ్యరు, పూల బోకేను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో జనగామ మున్సిపాలిటీ 30 వార్డులు, స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలలో 18 వార్డుల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లపై సాధారణ అబ్జర్వర్కు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ వివరించారు.