నూతన మార్కెట్ ను సద్వినియోగం చేసుకోవాలి
జనగామ, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): జనగామ పురపాలక పరిధిలోని సంజయ్ నగర్ లో నూతనంగా నిర్మించిన మార్కెట్ ను ఆదివారం మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్,కమిషనర్ చిమ్ముల రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా సందర్శించారు. మార్కెట్ లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులను పరిశీలించి, మార్కెట్ ను పరిశుభ్రంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.వ్యాపారులు రోడ్లపై కాకుండా నూతన మార్కెట్ లోనే వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
13-09-2026 | 02:28pm