22 April, 2026 | 2:59 PM

Breaking News

చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •  

Districts - Khammam

article_29305223.webp
కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి

ఖమ్మం,(విజయక్రాంతి): కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీలో బుధవారం చింతపల్లి నుంచి ముత్తగూడెం వరకు 6 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ... నేడు శంకుస్థాపన చేసిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను రాబోయే వర్షాకాలానికి ముందే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో, నిర్దిష్ట కాలపట్టికలో పూర్తి చేయాలని, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా పర్యవేక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ముత్తగూడెంకు గత కాలంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లు, లింకు రోడ్ల అభివృద్ధికి కలిపి రూ.16 కోట్ల 70 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.

22-04-2026

article_82286328.webp
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

ఖమ్మం,(విజయక్రాంతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఖమ్మం నగరం 1వ, 59వ, 60వ డివిజన్‌లకు చెందిన (27) మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల గడప వద్దకే పథకాలను చేరవేస్తున్నామని అన్నారు.

22-04-2026