calender_icon.png 31 March, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_67631734.webp
ప్రచారం కాదు.. పని ముఖ్యమంటున్నా ఎమ్మెల్యే

30-03-2025

జడ్చర్ల: ప్రజలకు కావాల్సింది ప్రచారం కాదని... వారు కోరుకున్నది కోరుకునేది కేవలం ప్రజా సంక్షేమమే అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(Jadcherla MLA Anirudh Reddy) నూతన విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. జడ్చర్ల నియోజక వర్గంలో కొత్తగా నాలుగు విద్యుత్ 33/11 కేవి సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. రూ.14.60 కోట్ల రూపాయల వ్యయం తో ఈ కొత్త సబ్ స్టేషన్ల ను గొల్లపల్లి, ఆలూరు, రాణి పేట తో పాటు జడ్చర్ల పట్టణంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కొత్త సబ్ స్టేషన్ల ను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

article_26151465.webp
ఆ బస్టాండ్‌లో చోరీలు ఎక్కువ

30-03-2025

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి): ఆ బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో రద్దీ. రోజు వేలాదిమంది ఆ బస్టాండ్ కేంద్రంగా ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. అదే జడ్చర్ల బస్టాండ్(Jadcherla Bus Stand). ఈ బస్టాండ్ చోరీలకు నిలయంగా మారుతుంది. గత కొన్ని నెలల క్రితం రూ 30 లక్షల పైగా ఓ ప్రయాణికుడి బ్యాగ్ లో నుంచి చోరీకి గురైనట్లు తెలిసిన విషయమే. ఈ కేసులను పోలీసులు వేగవంతంగా విచారణ చేసి ఇతర రాష్ట్రంలో ఉన్న చోరీకి పాల్పడ్డ వ్యక్తులను సైతం అరెస్టు చేసి రికవరీ చేసిన విషయం విదితమే. ఈనెల 18వ తేదీన కూడా బస్టాండ్ లో నిజామాబాద్ జిల్లా కు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్లు చోరీ చేస్తూ పట్టుబడిన విషయం విధితమే. వీరిపై కూడా జడ్చర్ల పోలీసులు కేసు నమోదుచేసి ఫింగర్ ప్రింట్ ద్వారా చెక్ చేయడంతో గతంలో కూడా జైలుకు సైతం వారు వెళ్లి వచ్చినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇలా ఇటీవల కాలంలో జడ్చర్ల బస్టాండ్ లో సెల్ఫోన్ చోరీలతోపాటు నగదు చోరీలు సైతం జరుగుతున్నాయి. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిను నిరంతరం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

article_35618511.webp
దేశ, విదేశాలలో జేపీఎన్సీఈ విద్యార్థులు

30-03-2025

మహబూబ్​నగర్, (విజయక్రాంతి): పేద జిల్లా.. కరువు జిల్లా... అంటూ పేరుగాంచిన పాలమూరు జిల్లాకు మణిహారంగా జెపిఎన్సిఈ కళాశాల నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంజనీరింగ్ విద్యకు ఎక్కడో ప్రధాన పట్టణ కేంద్రాల కు వెళ్లి లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టలేక దూరమవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు జేపీఎన్ సీఈ కళాశాల ఇంజనీరింగ్ విద్యను నిరుపేద విద్యార్థులకు దగ్గర చేసింది. ఇంజనీరింగ్ విద్య చదివే విద్యార్థులకు ఈ కళాశాల ఎంతో మేలు చేకూర్చుతుంది. మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని ధర్మపురంలో ఈ కళాశాల కొలువుతీరిన విషయం అందరికీ విధితమే. ఈ కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలలో ప్రత్యేక హోదాలలో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ కేస్ రవికుమార్ విజయ క్రాంతి దినపత్రికతో ప్రత్యేకంగా సంభాషించారు.