18 July, 2026 | 12:20 AM

Districts - Mahabubnagar

article_73268970.webp
ప్రజలకు జవాబుదారీగా ఉండండి

చిన్నచింత కుంట : ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. సీసీ కుంట పోలీస్ స్టేషన్‌ను(CC Kunta police station) జిల్లా ఎస్పీ డి.జానకి ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పనితీరుపై సమీక్ష, ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు స్థితి, గ్రేవ్ కేసుల విచారణ, నాన్-గ్రేవ్ కేసుల పరిష్కారం, వారెంట్ల అమలు, పెండింగ్ పిటిషన్లు, కోర్టు ట్రయల్‌లో ఉన్న కేసులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఎస్పీ సమీక్షించారు. ప్రతి కేసును వేగవంతంగా, నాణ్యమైన దర్యాప్తుతో పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.నేరాల నియంత్రణకు బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, గ్రామాల వారీగా అనుమానాస్పద వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలని, పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

17-07-2026

article_10902136.webp
నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైనది సంపూర్ణ ఆరోగ్యమని యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఎం.వి చంద్రమౌళి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని శివం కాన్వెంషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడారు. ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్ అరుదైనా వ్యాధిని భావించడం జరుగుతుందన్నారు. సకాలంలో గుర్తిస్తే అత్యధిక వస్క్యూ లర్ శాస్త్రచికిత్స తో పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. సాధారణ హవాయ పనితీరును కాపాడేందుకు బౌల విభాగాల వైద్యుల సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. క్లిష్టమైన రక్తనాళాల వ్యాధుల్లో వ్యాధిగ్రస్తా బాగానే తొలగించిన తర్వాత ఆరోగ్యకరమైన కణజాలాన్ని సంరక్షించడం ఆవయవాల మెరుగైన పనితీరును రూపాన్ని కాపాడవచ్చు అన్నారు.

15-07-2026