పాలమూరు కార్పొరేషన్ డిమాండే వేరు
04-02-2026
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ తొలి కార్పోరేటర్ అయ్యేందుకు పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల సైతం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పాలమూరు కార్పొరేషన్ లో 60 మంది కార్పొరేటర్ లను ఎన్నుకోవలసి ఉండగా 347 మంది అభ్యర్థులు బరిలో ఉండడం ఇంత ప్రజలతో ఉందో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం నెలకొంది. అప్ 2, బీజేపీ 52, బిఎస్పి 7, సిపిఎం 1,కాంగ్రెస్ 60,ఎంఐఎం 16, బీఆర్ఎస్ 58,ఎఐఎఫ్ బీ 3, ఐయుఎంఎల్ 2,జేయస్పి 18, ఇతర పార్టీ 1, స్వతంత్ర అభ్యర్థులు 127, మొత్తం 347 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బిజెపి పార్టీ 60 డివిజన్లో పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ 52 డివిజన్లను మాత్రమే బరిలో తమ అభ్యర్థులను నిలిపింది. బీఆర్ఎస్ పార్టీ సైతం 58 మంది అభ్యర్థులను మాత్రమే బరిలో ఉంచింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో 60 డివిజన్లో 60 మంది అభ్యర్థులను పోటీలో ఉంచడం ఉంచింది. పార్టీ అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించగా స్వతంత్ర అభ్యర్థులకు సైతం ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం సాయంత్రం గుర్తులను కేటాయించి బరిలో నిలుచున్న అభ్యర్థులకు అందజేశారు.