calender_icon.png 4 February, 2026 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_52173126.webp
రాతిలో సంగీతం.. స్తంభాల్లో ప్రతిధ్వని

04-02-2026

వెంకటాపూర్, ఫిబ్రవరి03, (విజయక్రాంతి): మండలంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి అఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి కుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ అద్భుత శిల్పకళా సౌందర్యాన్ని ఆయన ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ శైలి, శిల్పాల నైపుణ్యం, దేవాలయ గర్భగృహం, స్తంభాలపై చెక్కిన సున్నితమైన శిల్పాలు, నర్తకీ మణులు, శబ్ద స్తంభాలు వంటి విశేషాలను టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ విపులంగా వివరించారు.

article_37164117.webp
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

04-02-2026

ఏటూరునాగారం,ఫిబ్రవరి3 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో పలు గ్రామాల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి సీతక్క ఆదేశాల మేర కు,జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్నల బ్ధిదారులకు పంపిణీ చేశారు. హళావత్ కళ్యాణి-15వేలు, అనుము నీలయ్య-20వేలు, కొండమల్ల రాణి 21వేలు, సంగిరెడ్డి లక్ష్మి 25వేలు, బోట పోసాని -32వేలు, తుమ్మ నవనీత రావు- 37వేలు, గార జయమ్మ- 43వేలు, జక్కుల లత 45వేలు, లొటపెట్టల మహాలక్ష్మి-1లక్ష10వేలు, బండారి రాజు- 1. 14వేల రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణి చేశారు.

article_89192720.webp
ములుగులో మత్తు జోరు

04-02-2026

ములుగు, ఫిబ్రవరి3 (విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయం-ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఓ వ్యక్తి మద్యం మత్తులో గం టల తరబడి స్పృహ లేకుండా పడిపోయినా అధికారులు పట్టించుకోకపోవడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. మంగళవా రం ఉదయం నుంచే సదరు వ్యక్తి ఎక్సైజ్ కార్యాలయం మెట్ల మార్గంలో మత్తులో నిద్రపోతూ కనిపించాడు. ప్రభుత్వ కార్యాల యం ముందు ఇలాంటి పరిస్థితి ఉన్నా, కార్యాలయంలో సిబ్బంది ఉన్నప్పటికీ క నీసం స్పందించకపోవడం విమర్శలకు దారి తీసింది. ప్రజల రాకపోకల మధ్య ఈ దృశ్యం కనిపించడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

article_26702745.webp
ఆదివాసి బిడ్డను.. పారిపోను

02-02-2026

మేడారం, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మేడారం మహా జాతర సందర్భంగా తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో ఆదివాసీల అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పరితపించే ఆదివాసి బిడ్డను తాను అని పేర్కొన్నారు. తాను పారిపోయే రకం కాదని, భక్తులు, ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకమని స్పష్టం చేశారు. ఆదివారం మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆమె మాట్లాడారు. ఆదివాసి అస్తిత్వం, తల్లుల పట్ల అచంచల భక్తి తన జీవన విధానమని, మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు చేసే కుట్రలకు భ యపడబోనని మంత్రి తెలిపారు.

article_71474881.webp
జాతర విజయానికి పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అనిర్వచనీయం

02-02-2026

ములుగు, జనవరి1(విజయక్రాంతి): ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్కసారలమ్మ మహా జాతర సందర్భంగా చేపట్టిన పారిశుధ్య నిర్వహణపై పంచాయతీరాజ్, శానిటేషన్ శాఖల సిబ్బందితో మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి మేడారంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, కోట్లాది మంది భక్తులు హాజరైన మహా జాతరను పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించడంలో పారిశుధ్య సిబ్బంది కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. జాతర కాలమంతా నిరంతరంగా క్షేత్రస్థాయిలో పనిచేసి, మేడారాన్ని పరిశుభ్రంగా ఉంచి నందుకు సిబ్బందికీ ధన్యవాదాలు తెలిపారు.