కష్టపడిన కార్యకర్తలకే ప్రాధాన్యత
03-02-2026
వెల్దండ ఫిబ్రవరి 2 కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి సైనికుల్లా పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ, ప్రభుత్వ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ అన్నారు.సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో పర్యటన సందర్బంగా ఆమెకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకుల, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.