26 May, 2026 | 11:41 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

Districts - Nagarkurnool

article_70536970.webp
జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ పట్టణంలోని బొడ్రాయి ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్(Nagar Kurnool Collector Hemanta Keshav Patil) ఆకస్మికంగా సందర్శించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారులు తదితర మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలలో మున్సిపల్ కమిషనర్ నాగి రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

25-05-2026