18 July, 2026 | 12:20 AM

Districts - Nagarkurnool

article_18404796.webp
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్

కల్వకుర్తి జులై 17 : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, విద్యా ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్(Nagarkurnool District Collector) హేమంత కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో గాంధీనగర్ ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల బాధ్యత అత్యంత కీలకమని, విధుల పట్ల అలసత్వం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

17-07-2026

article_82419086.webp
గురువర్యా... ఇదేనా మీ తీరు.. !!

శ్లోకం అర్థం: గురువే బ్రహ్మ (సృష్టికర్త), గురువే విష్ణువు (పరిరక్షకుడు), గురువే పరమశివుడు (లయకారకుడు). ఆ గురువే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అటువంటి గొప్ప గురువుకు నా నమస్కారాలు. ఇలా ఉపాధ్యాయుని ఔన్నత్వాన్ని వివరిస్తుంటే.. కొంత మంది ఉపాధ్యాయులు మాత్రం.. విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రభుత్వం బడుల బలోపేతానికి నిరంతరం ప్రయత్నిస్తుంటే.. ఆయన సొంత నియోజకవర్గమైన (పుట్టిన ప్రాంతం) అచ్చంపేటలో మాత్రం పలువురు ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. దానికి ఉదాహరణే నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పనుంతల మండలంలోని రాయిచెడ్ ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. వారు మాత్రం గత రెండేళ్లుగా పాఠశాలకు వెళ్లి ముచ్చట్లతో కాలం గడుపుతూ ఉన్నారు. పాఠశాలలో విద్యార్థులు లేకపోవడమే ఈ దుస్థితికి ప్రధాన కారణం.

17-07-2026