calender_icon.png 30 March, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_55564031.webp
చిట్టీల వ్యాపారిని ఉరి తీయాలి!

29-03-2025

నాగర్‌కర్నూల్, మార్చి 28 (విజయక్రాంతి): నిరుపేదలకు అధిక వడ్డీ ఆశ చూపి రూ.కోట్లలో డబ్బులు తీసుకుని, ఎగనామం పెట్టిన చిట్టీల వ్యాపారి సాయిబాబాను బహిరంగంగా ఉరితీయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయిబాబా చేతిలో మోసపోయిన బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లన్న మాట్లాడారు. సుమారు 3 వేల మంది నుంచి రూ.150 కోట్లకు పైగా సాయిబాబా మోసగించాడని మండిపడ్డారు. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు లాలూచీపడి కేసు నీరుగార్చాని విమర్శించారు. మోసపోయిన బాధితులంతా మనోధైర్యాన్ని కోల్పోవద్దని, తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వచ్చేనెల 8లోగా దోచుకున్న డబ్బంతా సాయిబాబా తిరిగి బాధితులకు చెల్లించాలని, లేదంటే భూకంపాన్ని పుట్టిస్తానని హెచ్చరించారు.

article_21347073.webp
ముమ్మరంగా సహాయక చర్యలు

29-03-2025

నాగర్‌కర్నూల్, మార్చి 28 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకు న్న మిగతా ఆరుగురి కార్మికుల జాడ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. డేంజర్ జోన్ డీ డీh-2 వద్ద కార్మికుల ఆనవాళ్ల కోసం తవ్వకాలు జరుపగా ప్రస్తుతం ఎస్కవేటర్‌ల సాయంతో మట్టితీత పనులు వేగవంతం చేశారు. లోకో ట్రైన్ ప్రమాద స్థలి వరకు వెళ్లే విధంగా అడ్డుగా ఉన్న మట్టిని టీబీఎం యంత్ర విడిభాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నారు. ప్రస్తుతం నీటి ఊటను ఎప్పటికప్పుడు బయటకి తరలించేందుకు మరిన్ని మోటార్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

article_60919687.webp
బ్రోకర్ల అవతారంలో విద్యుత్ కాంట్రాక్టర్లు!

29-03-2025

నాగర్ కర్నూల్ మార్చి 28 విజయక్రాంతి భూతల్లిని నమ్ముకొని సాగు చేస్తున్న రైతాంగానికి విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్ల రూపంలో కష్టాలు తప్పడం లేదు. బోరు మోటర్లకు విద్యుత్ కనెక్షన్ కోసం డీడీలు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు. డీడీలు కట్టిన 90 రోజుల్లోనే ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు ఇతర సామాగ్రి సరఫరా చేస్తూ సంబంధిత కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ డీడీలు కట్టి ఏళ్లు గడుస్తున్నా ఆ రైతాంగానికి విద్యుత్ కనెక్షన్ మాత్రం అందించడం లేదు. ఫలితంగా వర్షాధార పంటల పైనే ఆధార పడాల్సి వస్తుంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవాల్సింది పోయి కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు ఆశపడి రైతాంగం ఆవేదనను పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు.

article_59004791.webp
వేగం పెంచిన రెస్క్యూ బృందాలు

28-03-2025

నాగర్‌కర్నూల్, మార్చి 27 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయ టకు తీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. గురువారం సొరంగంలోని డేంజర్ జోన్ వద్ద దుర్వాసన మరింత పెరగడంతో కార్మికుల ఆనవాళ్లు దొరికే ఆస్కారం ఉన్నట్లు భావిస్తూ మరోసారి కేరళ జాగిలాలతో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. సహాయక చర్యలకు అడ్డుగా ఉం టున్న టీబీఎం యంత్రాలను థర్మల్ ప్లాస్మా కట్టర్ ద్వారా వేరు చేస్తూ లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపుతున్నారు. సొరంగంలో ఎనిమిది మంది చిక్కుకోగా రెండు మృతదేహాలను బయట కు తీశారు. మరో ఆరుగురి కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌లో వేగం పెంచారు. గురువారం ప్రతేక అధికారి శివశంకర్ లోతేటి సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.