పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా దాడుల నేపథ్యంలో భారత దేశంలో ఇంధన కొరత, ధరల పెరుగుదల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ఆయా పెట్రోల్ బంకుల్లో(petrol pumps) ఇంధన కొరత ఉన్నట్లు నో స్టాక్ బోర్డులు తగిలించారు. దీంతో వాహనదారుల్లో మరింత ఆందోళన పెరగడంతో బుధవారం జిల్లా కేంద్రంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం కార్లు, బైకులు, ఆటోలు క్యూలో నిల్చున్నాయి.
25-03-2026