calender_icon.png 5 February, 2026 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_26976811.webp
ఎస్‌ఎఫ్డీఆర్ ప్రయోగం సక్సెస్

04-02-2026

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౩: భారత రక్షణ వ్యవస్థ అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. దేశ క్షిపణి వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు డీఆర్డీవో ప్రతిష్ఠాత్మకంగా తయారుచేసి న సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ క్షిపణి (ఎస్‌ఎఫ్డ్‌ఆర్)ని మంగళవారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ప్ర యోగించి సక్సెస్ అయింది. గగనతలం నుంచి గగనతలంలోకే ప్రయోగించేందుకు ఈ క్షిపణిని ఉపయోగపడుతుంది. ప్రయోగ పరీక్షలో అన్ని రకాల సాంకేతిక వ్యవస్థలు సక్రమంగా పనిచేశాయని డీఆర్డీవో వర్గాలు ప్రకటించా యి. క్షిపణి ద్వారా సుదూరంగా ఉన్న శత్రు దే శాల లక్ష్యాలను సులభంగా ఢీకొట్టవచ్చని తెలిపాయి. ప్రయోగానికి అనేక సంస్థలు సహాయ, సహకారాలు అందించాయని పేర్కొన్నాయి.

article_10145515.webp
భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ

04-02-2026

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౩: అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిస్తుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో మంగళవారం నేషనల్ డెమోక్రాటిక్ కూటమి (ఎన్డీయే) ఎంపీలతో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా విధిస్తున్న వస్తు సుంకం 18 శాతానికి తగ్గడం భారత ఎగుమతిదారులకు లభించిన గొప్ప విజయమని అభివర్ణించారు. కొనియాడారు. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయంగా తయారీ రంగం బలోపేతం అవుతుందని ప్రధాని ఆకాంక్షించారు. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత్ తన ముద్ర వేయాలని ఆయన పిలుపునిచ్చారు.