calender_icon.png 30 March, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_19134576.webp
దీక్షభూమిని సందర్శించిన ప్రధాని మోదీ

30-03-2025

నాగ్‌పూర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్(Bhimrao Ramji Ambedkar) 1956లో తన వేలాది మంది అనుచరులతో బౌద్ధమతం స్వీకరించిన నాగ్‌పూర్‌లోని దీక్ష్‌భూమిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ఆదివారం సందర్శించారు. దీక్ష్‌భూమిలోని బుద్ధ విగ్రహం వద్ద కూడా ప్రధాని ప్రార్థనలు చేశారు. దీక్ష్‌భూమి సన్యాసులు ప్రధానికి పూల గుత్తి, శాలువాను అందజేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Maharashtra Chief Minister Devendra Fadnavis), ఇతర నాయకులు కూడా ప్రధాని మోదీతో ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ త్వరలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అంతకుముందు, నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌లోని స్మృతి మందిర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కు ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

article_21143448.webp
మయన్మార్-బ్యాంకాక్ భూకంపం.. ఆగని మృత్యుఘోష

30-03-2025

నేపిడా: మయన్మార్ భూకంపం(Myanmar earthquake) ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. రాత్రి వరకు 1,644 మంది చనిపోయినట్లు సైనిక ప్రభుత్వం వెల్లడించింది. మరో 3408 మంది గాయపడ్డారని మయన్మార్ సైనిక ప్రభుత్వం(Myanmar Military Government) ప్రకటించింది. 139 మంది ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం విపత్తు నిర్వహణ బృందాలు గాలిస్తున్నాయి. రెండు భారీ భూకంపాల ధాటికి వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు వెలుగుచూస్తున్నాయి. మయన్మార్ లో రెండో అతిపెద్ద నగరం మాండలేలో భారీగా ప్రజలు మృత్యువాత పడ్డారు. మాండలే, నేపిడాలో సహాయ చర్యల్లో స్థానికులతోపాటు విదేశీ బృందాలు పాల్గొన్నాయి. ఐక్యరాజ్యసమితితో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల సహాయ చర్యలు చేపట్టాయి. మయన్మార్ లో సైనిక పాలన, భూకంప దృష్ట్యా తాత్కాలిక కాల్పుల విరమణ జరిగింది. థాయ్ లాండ్ లో భూకంపం ధాటికి 10 మంది మృత్యువాత పడగా, 78మంది ఆచూకీ గల్లంతైంది. థాయ్ లాండ్ లోనూ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

article_18050634.webp
1600 దాటిన మృతుల సంఖ్య

30-03-2025

నేపిడా, మార్చి 29: భూకంపాల కారణంగా మయన్మార్, థాయ్‌లాండ్‌లో మరణించిన వారి సంఖ్య 1,600 దాటింది. ఒక్క మయన్మార్‌లోనే 1,644 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు ౩,౪00 మంది గాయపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టుగా అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే భూకంప ధాటికి రోడ్లు, వంతెనలు భారీగా ధ్వంసం కావడంతో చాలా ప్రాంతాలకు రెస్క్యూ సిబ్బంది చేరుకోవడం సవాలుగా మారినట్టు తెలుస్తోంది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాం కాక్‌లో 30 అంతస్థుల భారీ భవంతి కూలిన ఘటనలో తొమ్మిది మంది మరణించారు. సుమారు 100 మంది జాడ గల్లంతైంది.