1600 దాటిన మృతుల సంఖ్య
30-03-2025
నేపిడా, మార్చి 29: భూకంపాల కారణంగా మయన్మార్, థాయ్లాండ్లో మరణించిన వారి సంఖ్య 1,600 దాటింది. ఒక్క మయన్మార్లోనే 1,644 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు ౩,౪00 మంది గాయపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టుగా అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే భూకంప ధాటికి రోడ్లు, వంతెనలు భారీగా ధ్వంసం కావడంతో చాలా ప్రాంతాలకు రెస్క్యూ సిబ్బంది చేరుకోవడం సవాలుగా మారినట్టు తెలుస్తోంది. థాయ్లాండ్ రాజధాని బ్యాం కాక్లో 30 అంతస్థుల భారీ భవంతి కూలిన ఘటనలో తొమ్మిది మంది మరణించారు. సుమారు 100 మంది జాడ గల్లంతైంది.