మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ
బెంగళూరు: కర్నాటక రాజకీయం మరొక్కసారి ఢిల్లీకి చేరింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను న్యూఢిల్లీకి పిలిపించారు. పార్టీ అంతర్గత విభేదాల పరిష్కారమే ప్రధాన అజెండాగా వీళ్ల పర్యటన సాగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ అంశాలపై చర్చించే అవకాశముంది. రాహుల్ గాంధీ కాసేపట్లో పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ కు చేరుకోనున్నారు. కర్నాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలతో నేతల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన 'ఇందిరా భవన్'లో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సమక్షంలో ఒక కీలక సమావేశం జరుగుతోంది.
26-05-2026