మరణించిన ఉద్యమకారులను గుర్తించాలి
ఆదిలాబాద్,(విజయక్రాంతి): స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులతో పాటు వివిధ కారణాలతో మరణించిన ఉద్యమకారులను సైతం గుర్తించాలని జిల్లా ఉద్యమకారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్ర వారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడ్డ ఉధ్యమకారులకు గుర్తింపు నివ్వాలని రాష్ట్ర స్థాయి కమిటీ నియమించిందని, ఈ కమిటీ సభ్యులు అన్ని జిల్లాలు తిరుగుతూ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించిందని, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన తొలి, మలిదశ ఉద్యమాలలో పాల్గొన్న వారిని గుర్తించాలని కమిటీ సభ్యులు ఎంఎల్సీ, ప్రొపెసర్ కోదండరాం, కే కేశవరావు, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, మోతె శోభన్ రెడ్డి, రాములు నాయక్ లను కలిసి విన్నవించామన్నారు.
17-07-2026