18 July, 2026 | 12:20 AM

Districts - Adilabad

article_83145604.webp
మరణించిన ఉద్యమకారులను గుర్తించాలి

ఆదిలాబాద్,(విజయక్రాంతి): స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులతో పాటు వివిధ కారణాలతో మరణించిన ఉద్యమకారులను సైతం గుర్తించాలని జిల్లా ఉద్యమకారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్ర వారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడ్డ ఉధ్యమకారులకు గుర్తింపు నివ్వాలని రాష్ట్ర స్థాయి కమిటీ నియమించిందని, ఈ కమిటీ సభ్యులు అన్ని జిల్లాలు తిరుగుతూ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించిందని, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన తొలి, మలిదశ ఉద్యమాలలో పాల్గొన్న వారిని గుర్తించాలని కమిటీ సభ్యులు ఎంఎల్సీ, ప్రొపెసర్ కోదండరాం, కే కేశవరావు, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, మోతె శోభన్ రెడ్డి, రాములు నాయక్ లను కలిసి విన్నవించామన్నారు.

17-07-2026

article_72538996.webp
సోయాబీన్ పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి

బోథ్, జూలై 17 (విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితుల వల్ల సోయాబీన్ పంట కు తెగులు సోగడంతో విజయ క్రాంతి పత్రికలో ప్రచురితమైంది.దీంతో శుక్రవారం మండలంలోని కౌటబి గ్రామంలో వ్యవసాయ అధికారి ఏఈఓ వాజిద్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పలువురి సోయా పంట పొలాలను పరిశీలించడం జరిగింది.ప్రస్తుతం పంటపై లద్దె పురుగు అభివృద్ధి ఉందని గమనించారు.అంతేగాక ఇనుము దాతులోపం పంటకు ఉండడంతో ఆకు పచ్చగా మారుతుందని గుర్తించారు.మైక్రో న్యూట్రిన్స్ మిశ్రమం ఎకరానికి 10 కిలోల చొప్పున పిచికారి చేయాలని రైతులకు సూచించారు.లద్దె పురుగు నివారణకు గుడ్ల గుంపు చిన్న లార్వాలను నాశనం చేయాలని వివరించారు మధ్య పురుగు ఉధృతి పెరిగితే బెంజోమేట్ ఐదు శాతం ఎస్ జి 80 గ్రాములు ఎకరానికి ఒక ఒక 150 నుండి 200 లీటర్లలో నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు. సాక్ష్యం చేస్తే రైతులు నష్టపోతారని వెంటనే మందులు పిచికారి చేయాలని సూచించారు.

17-07-2026