ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి
03-02-2026
ఆదిలాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): జిల్లాలోని రైతులు రసాయన ఎరువులు, పురుగుల మందులకు స్వస్తి పలికి, ప్రకృతి వ్యవ సాయం వైపు అడుగులు వేయాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, వ్యవసాయ, ఉద్యాన శాఖ లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ’ప్రకృతి వ్యవసాయంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని’ ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.