calender_icon.png 4 February, 2026 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_80576439.webp
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

03-02-2026

ఆదిలాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా, పారదర్శకంగా పనులు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ముఖ్యంగా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సం దర్భంగా సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ తో కలిసి పాల్గొన్న కలెక్టర్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై దిశ నిర్దేశం చేశారు.

article_89179875.webp
కన్నతల్లి జాడ కోసం పెంపుడు తల్లిదండ్రుల అన్వేషణ

02-02-2026

ఉట్నూర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): దత్తత తీసుకున్న కొడుకు అర్జున్ అలియాస్ డానీష్ కు జన్మనిచ్చిన తల్లి కోసం దత్తత తీసుకున్న డెన్మార్క్‌కు చెందిన దంపతులు అదిలాబాద్ జిల్లాకు వచ్చి బాబుకు జన్మనిచ్చిన తల్లి కోసం గిరిజన గ్రామాల్లో అన్వేషి స్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో చేతికి సగం వేళ్ళు ఉన్నాయని కన్నవారు బాలున్ని వదిలేసి వెళ్తే, భారతదేశ చట్టం ప్రకారంగా ఆ బాబుని తాము దత్తత తీసుకొని పెంచుకుంటున్నామని డెన్మార్క్ దేశం నుంచి వచ్చిన దంపతులు లూయిస్, రాస్మస్ తెలిపారు.

article_39301873.webp
ఆపరేషన్ స్మైల్ విజయవంతం

02-02-2026

ఆదిలాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ ను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్ పేరుతో జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 85 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు, వసతి గృహాలకు చేర్చి బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్‌ను విజయవం తం చేయడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్ స్మైల్‌లో హోటల్లలో, భవన నిర్మాణా లలో, ఇటుక బట్టిలలో పనులలో ఉన్న 85 మంది పిల్లలను రక్షించినట్టు అందులో 72 మంది పిల్లలను తల్లిదండ్రులకు, 13 మంది పిల్లలను వసతి గృహాలకు తరలించి సొంత వారికి అప్పగించినట్లు తెలిపారు.

article_60162644.webp
వనదేవతలకు మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే

02-02-2026

ఉట్నూర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కుటుంబ సమేతంగా వనదేవతలైన సమ్మక్క సారలమ్మ దర్శించుకున్నారు. శనివారం రాత్రి మేడారం లోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఇద్దరమ్మలకు ప్రత్యేక పూజ లు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ వన దేవతలను వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అందుకు వనదేవతలు ఉ మ్మడి జిల్లా ప్రజలపై ఆశీస్సులు ఉంచాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.