సైబర్ నేరాలు డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన సదస్సు
28-03-2025
తుంగతుర్తి, మార్చి 27 : ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ మండల కేంద్రం లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల లో సైబర్ నేరాలపైన, ఆన్ లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. సైబర్ మోసాలపై1930టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు.