ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగులు సిద్ధం
మిర్యాలగూడ, ఏప్రిల్ 21: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు నేటి నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మెకు ఉద్యోగ సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు మిర్యాలగూడ డిపో జేఏసీ నాయకులు తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజియన్ కార్యదర్శి గోపనబోయిన శ్రీనివాస్, డిపో కార్యదర్శి వలిశెట్టి సత్యనారాయణ, యస్.సి/యస్.టి ఎంప్లాయిస్ అసోసియేషన్ రీజియన్ కార్యదర్శి కడియం రమేష్, అధ్యక్షులు దైద బాల తదితరులు సోమవారం ప్రకటించారు.
22-04-2026