ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
చిట్యాల, మే 24: చిట్యాల మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం చిట్యాల మండలం లోని ఉరుమడ్ల, పెద్దకాపర్తి, గుండ్రాంపల్లి, సుంకేనపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
25-05-2026