వీవోఏపై అధికారులు చర్యలు తీసుకోవాలి
వేములపల్లి, మార్చి 25 : మండల పరిధిలో ని లక్ష్మీదేవిగూడెం వి ఓ ఏ ముత్యాల సరిత అవినీతి చేస్తుందని ఆమెపై అధికారులు చర్యలు తీసుకోవాలని సంఘం సభ్యులు కోరారు. గ్రామంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. గత సంవత్సరం నవంబర్ నెలలో కలెక్టర్ గారికి ఆమె అక్రమాలపై ఫిర్యాదు చేశామన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జనవరి 30వ తారీఖున సిసి, ఏపిఎం, బిపియంలు మా గ్రామానికి వచ్చి విచారణ జరిపారన్నారు.
26-03-2026