24 March, 2026 | 11:29 AM

Districts

article_50451072.webp
42 ఏళ్ల తర్వాత.. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

వారందరూ ఒకే చదువుల అమ్మ ఒడి లో చదువుకున్నారు.పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో 42 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై ఆదివారం బాలభారతి పాఠశాల లో కలుసుకున్నారు. ముఖ కవళికలను చూసి పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఆప్యాయతతో ఏరా....అంటూ కౌగిలించుకోవడంతో సభా వేదిక మొత్తం చప్పట్లతో మార్మోగింది. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని బాల భారతి ఉన్నత పాఠశాల లో 1984-85 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన వివిధ ప్రాంతాలకు చెందిన పూర్వ విద్యార్థులు అందరూ ఎస్పీఎం హెచ్ఆర్డి హాల్ లో ఒకే చోట చేరి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.

22-03-2026