26 May, 2026 | 11:42 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

Districts - Kumarambheem Asifabad

article_22911266.webp
బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ప్రజా పాలన ప్రత్యేక ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ మండలం కౌటగూడ గ్రామపంచాయతీలో నిర్వహించిన “బాల్య వివాహ ముక్త్ భారత్” కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి బూర్ల మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు సమాజం మొత్తం కృషి చేయాలని, బాలికలకు 18, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరపాలని సూచించారు.పిల్లల రక్షణ, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, పిల్లలపై హింస నివారణలో గ్రామస్థాయి బాల సంరక్షణ కమిటీలు కీలకంగా పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లైలా, పంచాయతీ కార్యదర్శి శ్వేత, కౌన్సిలర్ చంద్రశేఖర్, యుక్తవయసు బాలికలు, వారి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

26-05-2026