calender_icon.png 4 February, 2026 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_51176750.webp
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

03-02-2026

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని రామక్కపల్లి గ్రామానికి చెందిన కట్ట లక్ష్మమ్మ,కట్ట బాలయ్యలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును పంపిణీ చేసినట్లు అచ్చయపల్లి గ్రామ సర్పంచ్ బెస్త సాయిలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ బెస్త సాయిలు మాట్లాడుతూ....పేద ప్రజలను ఆపదలో ఆదుకునేందుకే స్థానిక ఎమ్మెల్యే మదర్ మోహన్ రావు సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 34000, 20000 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.గ్రామంలో ఇంకెవరైనా నిరుపేదలు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో ఎక్కువ బిల్లులు చెల్లించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉంటే తెలియజేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

article_22908156.webp
మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

02-02-2026

నిజామాబాద్ ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): విధి నిర్వహణలో గంజాయి ముఠా ఘాతుకానికి గత నెల 23వ తేదీ సాయంత్రం బలమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూన్నా సౌమ్య హైదరాబాద్ లో నీ నిమ్స్ లో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. పొరుగు జిల్లా నుండి గంజాయి అక్రమ రావణ సాగిస్తున్న గంజాయి మాఫియా ముఠా వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో.. సౌమ్య పై దుండగులు దాడికి తెగబడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారుతో ఆమెను ఢీకొట్టడంతో ఆమె తీవ్ర గాయాల పాలయ్యారు. గంజాయి ముఠా పాల్పడిన ఘాతుకంలో సౌమ్య తీవ్రంగా గాయపడగా ఆమె మూత్రపిండాలు, ప్లీహం, కాలేయం దెబ్బతినడంతో ప్రాథమికంగా నిజామాబాద్ లో ఆమెకు చికిత్స అందించినప్పటికీ మెరుగైన చికిత్సకై హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు.

article_73593467.webp
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి

31-01-2026

నిజాంసాగర్, జనవరి,30 (విజయ క్రాంతి): రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగింది.. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో పోటీ చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు..ఈ నామినేషన్ మహోత్సవానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులతో కలిసి బిచ్కుంద పార్టీ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి భారీ సంఖ్యలో ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు.