సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలి
29-03-2025
నిజామాబాద్, మార్చి 28 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారు లకు సూచించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం లో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ అండ్ సర్వే తదితర శాఖల అధికారులతో ప్రభుత్వ సలహాదారు పోచారం, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష జరిపారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ డీ.ఎఫ్.ఓ వికాస్ మీనా, కామారెడ్డి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న పనుల స్థితిగతుల గురించి అధికారులు పోచారం దృష్టికి తెచ్చారు.