calender_icon.png 30 March, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_72863877.webp
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

29-03-2025

నిజామాబాద్, మార్చి 28 (విజయ క్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాలకు నిజామాబాద్ జిల్లాలోని వెనుకబడిన వర్గాల బీ.సీ, ఈ.బీ.సీ, (ఈ.డబ్ల్యూ.ఎస్), ఫెడరేషన్ లకు చెందిన నిరుద్యోగ యువతీ/ యువకులు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు రుణం పొందవచ్చన్నారు. 50 వేల రూపాయల లోపు విలువ చేసే యూనిట్ కు 100 శాతం సబ్సిడీ వర్తిస్తుందని, లక్ష రూపాయల లోపు యూనిట్ కు 90 శాతం సబ్సిడీ, 2 లక్షల యూనిట్ కు 80 శాతం సబ్సిడీ, 4 లక్షల వరకు విలువ చేసే యూనిట్ కు 70 శాతం సబ్సిడీ వర్తిస్తుందని వివరించారు.

article_87274142.webp
రైతుల గోస వినని కాంగ్రెస్ ప్రభుత్వం

29-03-2025

నిజామాబాద్, మార్చి 28 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. కారంలోకి వచ్చిన వెంటనే లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీలు ఇచ్చారని ప్రస్తుతం ఒకటి కూడా నోచుకోలేదని ఆయన అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేడు నగరంలోని ధర్నా చౌక్ లో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు పాల్గొన్నారు. ప్రశ్నించారు. పంటలకు నీరు లేక రైతులు కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం సుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు.

article_89271737.webp
సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలి

29-03-2025

నిజామాబాద్, మార్చి 28 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారు లకు సూచించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం లో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ అండ్ సర్వే తదితర శాఖల అధికారులతో ప్రభుత్వ సలహాదారు పోచారం, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష జరిపారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ డీ.ఎఫ్.ఓ వికాస్ మీనా, కామారెడ్డి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న పనుల స్థితిగతుల గురించి అధికారులు పోచారం దృష్టికి తెచ్చారు.

article_34681258.webp
రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు విజయవంతం

28-03-2025

నిజామాబాద్, మార్చి 27 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు విజయవంతంగా పూర్తయ్యాయని, నిజామాబాద్ లో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు భాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, మాజీ శాసనసభ్యులు ఉజ్జయిని యాదగిరిరావు లు అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభలు ముగింపు కార్యక్రమం నిజామాబాద్ లోని బి ఎల్ ఎన్ ఫంక్షన్ హాల్ లో ఉదయం ప్రారంభమయ్యింది. ఈ సభ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ లు వ్యవహరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నివేదికను చదివి వినిపించారు. 14 తీర్మానాలను కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అనంతరం నూతన రాష్ట్ర కమిటీ కమిటీని ఎన్నుకున్నారు. 27 మంది ఆఫీస్‌ఆఫీస్ బేరర్స్ ని ఎన్నుకున్నారు.

article_64848307.webp
సంపత్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

28-03-2025

నిజామాబాద్, మార్చి 27 (విజయ క్రాంతి): ఇటీవల నిజామాబాద్ జిల్లాలో జ్యుడిషరీ రిమాండ్లో చనిపోయిన అల్లకుంట సంపత్ మృతిపై విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి జిల్లా సంఘం ఆధ్వర్యంలో జరిపించిన నిజనిర్ధారణ నివేదికను విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన అల్లికుంట సంపత్ ను మార్చి 12న విచారణలో భాగంగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని, మార్చి 13న సంపత్ ను జగిత్యాల తీసుకెళ్లి అతని ఆఫీస్ సోదా చేశారు. ఈ క్రమంలో సంపత్ అస్వస్థతత కు గురయ్యాడని, ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడనీ పోలీసులు చెప్పారని గుర్తు చేశారు.