26 May, 2026 | 11:41 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

Districts - Bhadradri Kothagude

article_31100965.webp
కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ

ఇల్లందు, మే 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపు కార్మికులకు లాభం కంటే నష్టమే కలిగిస్తోందని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.సీతారామయ్య అన్నారు. మంగళవారం ఇల్లందులో జరిగిన ఐఎఫ్‌టీయూ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న వేతనాల కంటే ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు తక్కువగా ఉండటంతో అన్‌స్కిల్డ్ నుంచి హైస్కిల్డ్ కార్మికుల వరకు వేల రూపాయల నష్టం జరుగుతోందన్నారు. కనీస వేతనాలపై పునఃసమీక్ష చేపట్టి కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించాలని, నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కొక్కు సారంగపాణి, తోడేటి నాగేశ్వరరావు, డి.ప్రసాద్, ఎన్.సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

26-05-2026

article_49243014.webp
ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది

దమ్మపేట, మే 26(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట వి ఓ ఎ లు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మెకు అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబళ్ల రవి, బీజేపీ పార్టీ తరుపున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తంబళ్ళ రవి మాట్లాడుతూ కొన్ని రోజులుగా వి ఓ ఎ లు నిరసన తెలియజేస్తున్నా కూడా ఏ అధికారికి చలనం లేదని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని, గత ప్రభుత్వం బి ఆర్ ఎస్ పార్టీ పాలించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ పాలన ఉందని, గత ప్రభుత్వానికి ఆడ బిడ్డల ఉసురు తగిలి ఫాం హౌస్ కె పరిమితం అవ్వాల్సి వచ్చిందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే అవుతుందని, ఈ రెండేండ్లలోనే విపరీతమైన వ్యతిరేకత మూట కట్టుకున్నదనీ, పని చేయించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని చిన్న చూపు చూడడం సరికాదని, వెంటనే వి ఓ ఎ ల డిమాండ్లను పరిష్కరించకపోతే వారితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు ఉడతనేని విశ్వేశ్వరరావు, గూడా ముత్యాలరావు, దొడ్డ సతీష్, కారం రత్నకుమారి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

26-05-2026

article_51677440.webp
కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి

దమ్మపేట, మే 26(విజయక్రాంతి): మండల పరిధిలోని లింగాలపల్లి గ్రామానికి చెందిన సోయం లాలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఖమ్మం పట్టణంలోని యలమద్ది ప్రైవేట్ హాస్పిటల్‌లో కోమాలో చికిత్స పొందుతుండగా, మంగళవారం బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు పరామర్శించి 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. యలమద్ది హాస్పిటల్‌లోని ఐసియులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సోయం లాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. లాలు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం నింపారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చాప చల్మారావు తదితరులు పాల్గొన్నారు.

26-05-2026

article_37882452.webp
పంట వ్యర్థాలను భూమిలో కలియ దున్నండి: మండల వ్యవసాయ అధికారి

దమ్మపేట, మే 26(విజయక్రాంతి): ఈ సంవత్సరం యాసంగి 2026 నందు దమ్మపేట మండలంలో 9 వేల ఎకరాల్లో వరి సాగు, మొక్కజొన్న పంట సుమారు ఐదువేల ఎకరాల్లో సాగు చేశారని, ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంట హార్వెస్టింగ్ పూర్తి కావచ్చిందని, పంట తీసుకున్న తర్వాత పంట అవశేషాలు అనగా వరి పంటలో వరి కయ్యలు, అదేవిధంగా మొక్కజొన్న పంటలో మొక్కజొన్న దంటు ఆకు అలాగే పొలాల్లో వదిలేస్తామనీ దీనివల్ల ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉండటం వలన, విద్యుత్తు తీగల రాపిడి వలన గాని, మరే విధంగానైనా నిప్పురవ్వలు తగిలితే పంట పొలాల్లో ఉన్నటువంటి వ్యర్ధాలు పూర్తిగా తగలబడటం జరుగుతుందనీ, దీనివల్ల మనం భూసారాన్ని కోల్పోవడమే కాక పర్యావరణ కాలుష్యానికి కూడా కారకులమవుతామని, అంతేకాకుండా పామాయిల్ పంటలో అంతర పంటగా మొక్కజొన్న పంట సాగు చేసి అలా వదిలివేయడం వల్ల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి రైతులు తప్పనిసరిగా పంట పూర్తి అవ్వగానే వ్యర్ధాలను భూమిలో రోటవేటర్ తో భూమిలో కలియదున్నాలని తద్వారా భూ సారం కూడా పెరుగుతుందని మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

26-05-2026