భూ రీ-సర్వే జాప్యంపై మంత్రి ఆగ్రహం
బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం సారపాకలోని ఐటీసీ అతిథిగృహంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రీ-సర్వే, అటవీ–రెవెన్యూ భూ సమస్యలు, పోడు భూములు, పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై సమీక్షించారు.జిల్లాలో 70 గ్రామాల్లో రీ-సర్వే చేపట్టగా ప్రస్తుతం 14 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని, వాటిలో ఐదు గ్రామాల్లో పూర్తయ్యాయని అధికారులు వివరించారు.
19-07-2026