19 July, 2026 | 6:44 PM

Districts - Bhadradri Kothagude

article_30241949.webp
భూ రీ-సర్వే జాప్యంపై మంత్రి ఆగ్రహం

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం సారపాకలోని ఐటీసీ అతిథిగృహంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రీ-సర్వే, అటవీ–రెవెన్యూ భూ సమస్యలు, పోడు భూములు, పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై సమీక్షించారు.జిల్లాలో 70 గ్రామాల్లో రీ-సర్వే చేపట్టగా ప్రస్తుతం 14 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని, వాటిలో ఐదు గ్రామాల్లో పూర్తయ్యాయని అధికారులు వివరించారు.

19-07-2026

article_75664689.webp
నకిలీ సర్టిఫికెట్ తో పట్ట మార్పిడి.. తహసీల్దార్, జీపీఓ సస్పెండ్

దమ్మపేట, (విజయక్రాంతి): భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సంచలనం రేపిన అక్రమ వారసత్వ పట్టామార్పిడిలో దమ్మపేట తాహశీల్దార్ కె. రాంనరేష్, పెద్దగొల్లగూడెం గ్రామ పరిపాలన అధికారి వలవల అనంతమ్మను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. దమ్మపేట మండల పరిధిలోని ఏజెన్సీ ఏరియాలో గల పెద్దగొల్లగూడెం రెవెన్యూ సర్వే నెంబరు 385/54లో మళ్ళాసత్యం పేరుతో వున్న 5.00 ఎకరముల ఎసైన్మెంట్ భూమిని పట్టాదారు మళ్ళా సత్యం బ్రతికి వుండగానే నకిలీ మరణ ధృవపత్రము, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృషించి, పట్టాదారు మళ్ళా సత్యంకు ఎటువంటి బంధుత్వం లేని నామ పుష్పవతి భర్త సత్యనారాయణ పేరుతో వారసత్వ పట్టా మార్పిడి చేశారు.

19-07-2026