calender_icon.png 30 March, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_73433759.webp
నక్సల్స్‌కు మరో ఎదురుదెబ్బ

30-03-2025

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 29 (విజయక్రాంతి)/చర్ల: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరో మారు దద్దరిల్లింది. సుక్మా, బీజాపూర్ జిలాల్లో భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో 1౮ మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 11 మంది మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన మావోయిస్టుల్లో హైర్యాంక్ కమాండర్ కూడా ఉండటం మావోయిస్టులకు పెద్ద దెబ్బే. రూ. 25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు కమాండర్ జగదీశ్ అలియాస్ భద్ర ఈ కాల్పు ల్లో చనిపోయాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీస్ వర్గా లు తెలిపాయి. ఈ దాడిలో ముగ్గురు డీఆర్‌జీ సిబ్బం దికి ఒక సీఆర్పీఎఫ్ జవాన్‌కు కూడా గాయాలయ్యాయి.