నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలి
30-01-2026
నారాయణపేట క్రైం, మద్దూరు/కోస్గి,జనవరి 29: జిల్లాలోని మున్సిపాలిటీలలో నామి నేషన్ల ప్రక్రియ ను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రెండో రోజు గురువారం ఆయా ము న్సిపాలిటీలలో నామినేషన్లు ఎక్కువ సంఖ్య లో దాఖలు అయ్యో అవకాశం ఉందని, అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గురువారం కలెక్టర్ జిల్లాలోని మద్దూరు, కోస్గి మున్సిపాల్టీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరి శీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా కేంద్రాల్లోని ఆర్వోలకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణ ప్రక్రి యలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చారు.