calender_icon.png 5 February, 2026 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_75630559.webp
నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలి

30-01-2026

నారాయణపేట క్రైం, మద్దూరు/కోస్గి,జనవరి 29: జిల్లాలోని మున్సిపాలిటీలలో నామి నేషన్ల ప్రక్రియ ను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రెండో రోజు గురువారం ఆయా ము న్సిపాలిటీలలో నామినేషన్లు ఎక్కువ సంఖ్య లో దాఖలు అయ్యో అవకాశం ఉందని, అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గురువారం కలెక్టర్ జిల్లాలోని మద్దూరు, కోస్గి మున్సిపాల్టీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరి శీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా కేంద్రాల్లోని ఆర్వోలకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణ ప్రక్రి యలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చారు.

article_60363287.webp
యూరియా బుకింగ్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలి

30-01-2026

నారాయణపేట.జనవరి 29 (విజయక్రాంతి): యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.గురువారం కలెక్టర్ మద్దూరు పట్టణంలోని మన గ్రోమోర్ సెంటర్, కోస్గి పట్టణంలోని పీ ఏ సీ ఎస్ ను సందర్శించారు.యూరియా బుకింగ్ యాప్ పనితీరును పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులు యూరియా ఎలా బుక్ చేసుకోవాలి, డీలర్లు ఎలా సేల్స్ కన్ఫర్మేషన్ చేయాలి అనే అంశాలపై రైతులు,,డీలర్లకు అవగాహన కల్పించారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులు సులభంగా యూరియా బుక్ చేసుకోవచ్చని, ఎరువుల అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.