calender_icon.png 30 March, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_38707273.webp
ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు

29-03-2025

నారాయణపేట. మార్చి 28(విజయకాంతి) : ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్ర వారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ కేసులను పోలీసు అధికారులు సీరియస్ గా తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సమావేశంలో డిఎస్పి నల్ల పు లింగయ్య 2023 లో 31, 2024 లో 34, 2025 లో ఇప్పటిదాకా 7 ఎస్సీ ఎస్టీ కేసులు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల లో నమోదు అయ్యాయని, వాటిలో 13 కేసులకు గాను 3 కేసులు చార్జిషీట్ కు రెడీగా ఉన్నాయని, 4 కేసులు విచారణ దశలో ఉన్నాయనీ, మరో 6 కేసులకు సంబంధించి డాక్యుమెంట్స్ రావాల్సి ఉందని తెలిపారు.

article_65643127.webp
ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ సహజం

29-03-2025

నారాయణపేట. మార్చి 28(విజయక్రాంతి) : ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట జిల్లా పరిషత్ కార్యాలయ డిప్యూటీ సీఈవో జ్యోతి పదవి విరమణ కార్యక్రమా నికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ సీఈవో జ్యోతి జిల్లాకు అందించిన సేవలను గుర్తు చేశారు. ప్రతీ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని, జ్యోతి తో కలిసి తాను గత 8 నెలల నుంచి పనిచేశానని, అయితే తాను ఇక్కడికి వచ్చిన కొత్తలో డి ఆర్ డి ఏ, డిపిఓ, జెడ్పి సీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆయా ఇన్చార్జి బాధ్యతలను జ్యోతి సమర్థవంతంగా నిర్వహించిందని కలెక్టర్ కొనియాడారు. స్పెషల్ ఆఫీసర్ గా కూడా ఆమె ఎంతో నిబద్ధతతో పని చేసిందన్నారు. పదవి విరమణ అనంతరం కుటుంబానికి కూడా సమయం ఇవ్వాలని సూచించారు. .

article_81652575.webp
ట్రైనీ కలెక్టర్‌కు ఘన సత్కారం

22-03-2025

నారాయణపేట. మార్చి 21(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా కు గతేడాది ఏప్రిల్ లో శిక్షణ కోసం వచ్చి తిరిగి వెళ్తున్న ట్రైనీ కలెక్టర్ గరిమా నరులకు శుక్రవారం సాయoత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు పలికి పూల మాల, పుష్ప గుచ్చాలతో ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బేన్ షాలొమ్, సంచిత్ గ్యాంగ్వర్, ఆర్డీఓ రామచంద్ర నాయక్ తో పాటు పలువురు జిల్లా అధికారులు ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల తో విధి నిర్వహణలో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు.