ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
19-03-2025
నారాయణపేట. మార్చి 18(విజయక్రాంతి) : జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళ వారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కలెక్టర్ హౌసింగ్, డి ఆర్ డి ఏ, విద్యాశాఖ, ఆరోగ్య, పీఆర్, డీపీ వో, మున్సి పల్ శాఖల అధికారులతో ఆయా శాఖల ప్రగతి పనుల పై సమీక్ష జరిపారు.