4 September, 2026 | 10:50 PM

Breaking News

అబద్దాల కాంగ్రెస్ ని తరిమి కొట్టండి   •   ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం   •   శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •  

News -

article_71198441.webp
కొండా సురేఖ కాంగ్రెస్‌లో కొనసాగితే అవకాశం ఇస్తాం: మహేష్ కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కొండా సురేఖ పార్టీలో కొనసాగితే తప్పకుండా అవకాశం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి నాయకుడైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిన్న సురేఖ ఆవేశం, ఆవేదనతో మాట్లాడారని, ఇకపై బహిరంగంగా ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదని సూచించారు. గతంలో ఆమెకు రెండుసార్లు అవకాశం ఇచ్చామని, క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా ఏఐసీసీ చర్యలు తీసుకుందని తెలిపారు. పార్టీలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉన్నప్పటికీ క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటామని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.

04-09-2026 | 04:59pm