22 April, 2026 | 1:45 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

News -

article_14581813.webp
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(Nadendla Bhaskara Rao) మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో వారి అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తుచేసుకున్నారు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని రేవంత్ రెడ్డి భగవంతుడిని ప్రార్థించారు. వారి మరణంపట్ల ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా మాజీ సీఎం కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 90 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

22-04-2026

article_53198021.webp
పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(Kaleshwaram Lift Irrigation Project) నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను(Justice PC Ghose Commission Report) ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సీజే ధర్మాసనం నేడు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. పీసీ ఘోష్ కమిషన్ రద్దు చేయాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, స్మితా సబర్వాల్, ఎస్ కే జోషీ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా, సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.

22-04-2026

article_60703873.webp
కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె(Telangana RTC Strike) కొనసాగుతోంది. కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్(Kamareddy Bus Stand) వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల బందోబస్తు మధ్య అద్దె బస్సు నడిపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. బస్సును అడ్డుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు(RTC JAC Leaders) గాలి తీసేశారు. ప్రైవేట్ డ్రైవర్ సాయి రెడ్డిపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బస్టాండ్ లో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ సమ్మె వల్ల బస్సులు బాన్సువాడ డిపోలో(Banswada Bus Depot) ఆగిపోయాయి. బస్సులు బంద్ కావడంతో పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ సమ్మెతో ప్రైవేట్ వాహన దారులు ప్రయాణికుల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

22-04-2026

article_75146320.webp
చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షలు

లండన్ మహా నగరంలో రిధా మీడియా బి. నాగ మహేష్, టి.నరేందర్ తమ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు. తమ అభిమాన నాయకుడు జన్మదిన వేడుక లండన్ లోని బకింగ్ హామ్ షైర్ లో జరుపుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని, మంచి అనుభూతిని మిగిల్చిందని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అలాగే మంచి పరిపాలనా దక్షతతో కేంద్ర ప్రభుత్వ అండ దండలతో ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని ఆనందాన్ని తెలియజేశారు. అశేష ప్రజాభిమానంతో చంద్రబాబు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు

22-04-2026

article_36125398.webp
మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడు: చెన్నైలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress President Mallikarjun Kharge) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే(AIADMK) నేతలు మోదీతో ఎలా చేతులు కలుపుతారని ఖర్గే ప్రశ్నించారు. మోదీ.. ఒక ఉగ్రవాది(PM Modi as terrorist) అంటూ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బీజేపీకి సమానత్వం, న్యాయంపై నమ్మకం లేదు, అలాంటి బీజేపీ నేతలతో అన్నాడీఎంకే ఎలా చేతులు కలుపుతుందని ఖర్గే ప్రశ్నించారు. మోదీని ఉగ్రవాదిగా వ్యాఖ్యానించిన కాసేపటికే ఖర్గే వివరణ ఇచ్చారు. మోదీని ఉగ్రవాది అని నేనెప్పుడూ అనలేదు.. నా ఉద్దేశం మోదీ ఎప్పుడూ ప్రజలకు భయపెడుతున్నారనే అన్నారు. ఈ డీ, ఐటీ, సీబీఐ చూపించి మోదీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు.

21-04-2026