calender_icon.png 30 March, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_60598812.webp
చిన్నారులపై మారుతల్లి కర్కశత్వం

30-03-2025

హైదరాబాద్: గుంటూరు జిల్లా ఫిరంగిపురం(Phirangipuram)లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులపై మారుతల్లి కర్కశత్వం చూపించింది. మారుతల్లి లక్ష్మీ కార్తిక్ అనే బాలుడిని గోడకేసి కొట్టి ప్రాణాలు తీసింది. మరో బాలుడిని అట్ల పెనంతో వాతలు పెట్టింది. తీవ్ర గాయాలతో బాలుడు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సాగర్ అనే వ్యక్తి తన భార్య చనిపోవడంతో లక్ష్మీతో సహజీవనం చేస్తున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బాలుడు కార్తిక్ మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్(Guntur GGH)కు తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

article_13787579.webp
పండగ పూట బంగారం వ్యాపారి కుటుంబం ఆత్మహత్య

30-03-2025

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా(Sathya Sai district)లో ఉగాది పండగ(Ugadi festival)పూట విషాదం చోటుచేసుకుంది. మడకశిరలో గాంధీ బజారులో ఉంటున్న బంగారం వ్యాపారి కృష్ణచారి(Gold merchant Krishnamachari) కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దంపతులు కృష్ణచారి, సరళమ్మ, కుమారులు సంతోష్, భువనేశ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. నలుగురు కుటుంబసభ్యులు ఇంట్లో విగత జీవులుగా పడిఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులను అడిగి మృతుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

article_69385408.webp
నల్గొండలో ప్రతిపక్ష నాయకుల ముందస్తు అరెస్ట్

30-03-2025

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదివారం హుజూర్ నగర్ పర్యటనకు ముందు పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంతో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉగాది ఉత్సవాలు అస్తవ్యస్తంగా మారాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతాయని భావించి వివిధ సంస్థలకు చెందిన ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం అరెస్టులు జిల్లా అంతటా ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా కారణాలను పేర్కొంటూ కట్టంగూర్‌లో ఎంఆర్‌పిఎస్ నాయకులు, హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ తిరుగుబాటుదారులు, ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకున్నారు.