calender_icon.png 4 February, 2026 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_82079249.webp
కష్టపడ్డాం.. టికెట్ ఇవ్వరా?

04-02-2026

కామారెడ్డి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి తల నొప్పిగా మారాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ దక్కలేదని కొం దరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసం హరణకు చివరి రోజు కావడంతో రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో టికెట్ దక్కని కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్‌లో వర్గపోరుతో పలువురు నాయకుల అ నుచరులకు టికెట్లు గల్లంతయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో షబ్బిలి అనుచరులకు కొందరికి టికెట్లు గల్లంతయ్యాయి. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులకు కొందరికి చుక్కెదురయింది.