18 July, 2026 | 12:19 AM

News -

article_56515434.webp
చర్చనీయాంశంగా బీజేపీ నేతల కామెంట్స్

నిజామాబాద్: ఇందూర్ రణభేరి బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ నేతలకు చెందిన షో రూమ్ లలోని స్కూటీలు ఎత్తుకెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచించారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ మేరకు షో రూమ్ లలో స్కూటీలు ఎత్తుకెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ వ్యాఖ్యానించారు. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమర్థించారు. నిజామాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీల షోరూమ్ ఉందని అరవింద్ వెల్లడించారు. స్కూటీలు ఎత్తుకెళ్లడాన్ని నిజామాబాద్ నుంచే మొదలు పెట్టాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ బీజేపీ అభ్యర్థిపై రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి కొడంగల్ లో పోటీ చేస్తారి రాకేశ్ రెడ్డి వెల్లడించారు. కొడంగల్ లో ఈ సారి బీజేపీనే గెలుస్తోందని జోస్యం చెప్పారు.

17-07-2026

article_16685851.webp
స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి

కోల్‌కతా: స్కూల్ పిల్లల భద్రతకు దిక్కులేకుండా పోయింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం రైలు ఢీకొట్టిన ఘటనలో, తాము ప్రయాణిస్తున్న పూల్ కారులోని ఇద్దరు పాఠశాల విద్యార్థులతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. కర్ణ సుబర్ణ రైల్వే స్టేషన్ సమీపంలోని లెవల్-క్రాసింగ్ గేట్ వద్ద ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని ఈస్టర్న్ రైల్వే అధికారి పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న పూల్ కార్, కట్వాకు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణ సుబర్ణ స్టేషన్ సమీపంలోని లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద రైలు పట్టాలను దాటుతుండగా, స్థానిక రైలు ఆ వాహనాన్ని ఢీకొట్టింది.

17-07-2026

article_71893774.webp
నందిపేట తహసీల్దార్ సస్పెండ్

నందిపేట: నిజామాబాద్ జిల్లాలో(Nizamabad District) అసైన్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌కు(Illegal registration) సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో నందిపేట తహసీల్దార్ సంతోష్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్(Nandipet Tahsildar suspended) చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు సహకరించారన్న ఆరోపణలతో తహసీల్దార్‌పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నాట్లు తెలిపారు. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా, సంతోష్ రెడ్డిని విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొనసాగుతున్న విచారణ ఫలితం ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.

17-07-2026