మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు
29-03-2025
చేగుంట,విజయక్రాంతి: మెదక్ జిల్లా చేగుంట పట్టణం(Chegunta town)లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, చేగుంట తాసిల్దార్ శ్రీకాంత్, ఎస్ ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముస్లిం సోదరులు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు.