calender_icon.png 4 February, 2026 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_26702216.webp
బైక్ దొంగ అరెస్ట్

03-02-2026

మెదక్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ద్విచక్ర వాహన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మెదక్ టౌన్ సీఐ మహేష్ కేసు వివరాలను వెల్లడించారు. నర్సిములు అనే వ్యక్తి పని నిమిత్తం మెదక్కు వచ్చి, ఆటో నగర్లోని వన దుర్గ భవాని వైన్స్ షాప్ ముందు తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేయగా, గుర్తు తెలియని వ్యక్తి బైక్ను దొంగిలించాడు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం బోధన్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో, ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తూ పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానం వచ్చి పట్టుకుని విచారించారు.