22 April, 2026 | 2:24 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

Districts - Medak

article_87255043.webp
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి విరమణ సహజం

ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని చేగుంట మండల విద్యాధికారి నీరజ అన్నారు. మండల పరిధి లోని చిన్న శివనూర్ పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా గా పనిచేసిన బత్తుల రాములు మంగళవారం రిటైర్డ్ అయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకట్రామిరెడ్డి తో కలిసి వారు మాట్లాడుతూ. పాఠశాలలో విద్యార్థుల పట్ల ఎంతో శ్రద్ధ చూపుతూ, వారి ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకునేలా చేసిన బత్తుల రాములు కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన శేషజీవితం ప్రశాంతమైన వాతావరణంలో గడవాలని, ఆయూరారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

21-04-2026