2 September, 2026 | 5:25 AM

Districts - Jagtial

article_26767632.webp
గోదావరి పుష్కరాలకు మరో 40 కోట్లు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ధర్మపురి, ఆగస్టు29(విజయక్రాంతి): ధర్మపురి క్షేత్రంలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, ఆలయ అభివృద్ధిలో భాగంగా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకొని అమలు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్న ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం పునర్ నిర్మాణంపై సమీక్ష సమావేశం శనివారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రజాభిప్రాయ సేకరణ, సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జగిత్యాల జిల్లా గంధ్రాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ధర్మపురి ఆలయ ఈవో శ్రీనివాస్ తో పాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, ధర్మపురి పేద బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు.

29-08-2026 | 04:07pm