22 April, 2026 | 1:14 PM

Breaking News

ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •  

Districts - Jagtial

article_23017670.webp
బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ధర్మపురి,ఏప్రిల్18(విజయక్రాంతి): విద్యుత్ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబానికి రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం చెక్కులను అందజేశారు. ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన గటిక చిన్నయ్య మూడు సంవత్సరాల క్రితం విద్యుత్ షాక్ తో మరణించడంతో చిన్నయ్య భార్య గటిక అమ్మాయికి రూ. 5 లక్షల పరిహారాన్ని రాయపట్నం గ్రామ పంచాయతీ వద్ద జరిగిన కార్యక్రమంలో శనివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. అదే విధంగా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన రాపాక మహేందర్ గేదె విద్యుత్ షాక్ తో మరణించడంతో ప్రభుత్వం తరఫున రూ. 40 వేల పరిహారాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల జిల్లా ట్రాన్స్ కో ఎస్ఈ సుదర్శనం, డీఈ గంగారం, గ్రామ సర్పంచ్ మొగిలి తదితరులు పాల్గొన్నారు.

18-04-2026