ఏరియా హాస్పిటల్ను సందర్శించిన కేంద్ర బృందం
28-03-2025
జగిత్యాల, మార్చి 27 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు డాక్టర్ రమణ, డాక్టర్ శ్రీనివాస్ గురువారం కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని కోరుట్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిధిలో కేంద్ర ఆరోగ్య సేవా కార్యక్రమాల అమలు, నిర్వహణ తీరును సమీక్షించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, వైద్య బృందం, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్య సేవల అమలు, సిబ్బంది నియామకం, నిధుల వినియోగం గూర్చి చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ స్థాయిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలు, సేవల అమలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏరియా హాస్పిటల్ ద్వారా లబ్ధి పొందిన వారిని కలిసి, ఆరోగ్య సేవలు అందుస్తున్న విధానాన్ని వారితో ముఖా ముఖితెలుసుకున్నారు.