calender_icon.png 30 March, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_38691114.webp
కులాల పేర్లను గౌరవప్రదంగా మారుస్తాం

28-03-2025

జగిత్యాల, మార్చి 27 (విజయక్రాంతి): ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో, నేటికీ చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించింది. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి ఉదయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని, సాయం త్రం ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.

article_38940196.webp
మహాత్మాగాంధీ, అంబేద్కర్, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం

28-03-2025

కమాన్పూర్ రామగిరి, ముత్తారం, మార్చి 27 (విజయ క్రాంతి): భారత దేశంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగాన్ని గౌరవిద్దామని జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ పేడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవరెడ్డి రాష్ట్ర నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు పిలుపునిచ్చారు. గురువారం కమాన్పూర్ రామగిరి ముత్తారం మండల కేంద్రాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధన్ అభియాన్ సన్నాహక సమావేశం లో చైర్మెన్ జంగా రాఘవ రెడ్డి, మంత్రి సోదరుడు దుద్దిళ్ల శ్రీను బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

article_78378267.webp
ఏరియా హాస్పిటల్‌ను సందర్శించిన కేంద్ర బృందం

28-03-2025

జగిత్యాల, మార్చి 27 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు డాక్టర్ రమణ, డాక్టర్ శ్రీనివాస్ గురువారం కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని కోరుట్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిధిలో కేంద్ర ఆరోగ్య సేవా కార్యక్రమాల అమలు, నిర్వహణ తీరును సమీక్షించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, వైద్య బృందం, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్య సేవల అమలు, సిబ్బంది నియామకం, నిధుల వినియోగం గూర్చి చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ స్థాయిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలు, సేవల అమలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏరియా హాస్పిటల్ ద్వారా లబ్ధి పొందిన వారిని కలిసి, ఆరోగ్య సేవలు అందుస్తున్న విధానాన్ని వారితో ముఖా ముఖితెలుసుకున్నారు.

article_16078169.webp
ధరణి సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

25-03-2025

జగిత్యాల, మార్చి 24 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ధరణి సమస్యల గురించి రైతులు సమర్పించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించా లని జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ బిఎస్.లత సోమవారం ఆర్డీవోలు, తహసిల్దార్లు, సంబంధిత సిబ్బందితో ధరణి సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల వారిగా రైతులు సమర్పించిన ధరణి సమస్యల దరఖాస్తుల వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో వున్న అన్ని దరఖాస్తులను ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రానున్న రబీ ప్యాడి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కావలసిన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆయా మండలాల పరిధిలోని ఐకెపి కేంద్రాలను సందర్శించి, కావలసిన సౌకర్యాలు కల్పించాలని ఆర్డీవోలు, తహసిల్దార్లను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు.