calender_icon.png 5 February, 2026 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_48995046.webp
విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

05-02-2026

కామారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో విద్యుత్ షాక్ తో కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగి బుధవారం మృతి చెందారు. రామారెడ్డి గ్రామానికి చెందిన రవి 35 విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యో గీగా పని చేస్తున్నారు. విద్యుత్ లైన్ సరిచేస్తుండగా విద్యుత్ షాక్ గురై స్తంభం పైనే మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యులు బంధువులు నష్ట పరిహారం మృతుని కుటుంబానికి చెల్లించాలని ఆందోళన చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తామని కాంట్రాక్టు ఉద్యోగి కాబట్టి డబ్బులు రావని ఉన్నతాధికారులకు మాత్రం నివేదించి డబ్బులు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.

article_14367466.webp
సదాశివనగర్‌లో ఎక్స్‌ప్రెస్ ఆపాలని డీఎంకు వినతి

05-02-2026

కామారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): సదాశివ నగర్ లో ఎక్స్ప్రెస్ బస్సు లు ఆపాలని బుధవారం డిపో మేనేజర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కామారెడ్డి బస్ డిపో మేనేజర్ ని కలవడం జరిగింది. గ్రామపంచాయతీ పాలకవర్గం సదాశివ నగర్ లో బస్సు ఎస్ప్రెస్ ఆపాలని కోరారు. గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష రవి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఉప సర్పంచ్ ప్రవీణ్, వార్డ్ సభ్యులు బంధాల సాయవ్వ రాజు, బంధాల సాగర్, ఆశ మంజులరాజు, మ్యాదరి రాజమణి, ధర్మపురి పోసాని బైరు. పోలీస్ బాల్ రెడ్డి. ఎక్స్ప్రెస్ ఆపాలని డిపో మేనేజర్ కు రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. సదాశివనగర్ లో ఎక్స్ప్రెస్ ఆప్తమని డిపో మేనేజర్ హామీ ఇచ్చినట్లు వంకాయల రవి తెలిపారు.

article_65126836.webp
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

05-02-2026

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఉరివేసుకుని వ్యక్తి మృతి.ఎల్లారెడ్డి ఎస్త్స్ర మహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం వడ్డెర కాలనీకి చెందిన గండికోట మల్లేష్,వయసు (35) సంవత్సరాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడనీ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మానసికంగా కుంగిపోయి, జీవితంపై విరక్తి, చెంది ఈ నెల 3వ తేదీ రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో, చీరతో ఉరి వేసుకుని మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ ఘటనపై మృతుడి తండ్రి గండికోట ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి, ఎస్‌ఐ మహేష్ తెలిపారు.

article_41094569.webp
మాయదారి మాటలకు భ్రమ పడకండి.. ఎల్లారెడ్డి అభివృద్ధికి పట్టం కట్టండి

04-02-2026

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఆయన ఫామ్ హౌస్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12 వార్డులకు కౌన్సిల్ అభ్యర్థులను ఖరారు చేసామని ప్రచారం కూడా కొనసాగిస్తున్నామని రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ, గెలుపు ఖాయమని భీమా వ్యక్తం చేశారు. పత్రికా సమావేశంలో మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎప్పుడు వెనుకబడిన ప్రాంతమని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తుత శాసనసభ్యులు మదన్మోహన్ రావు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని మండిపడ్డారు.