దోమకొండలో ఎడ్లబండ్ల ఊరేగింపు
30-03-2025
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఆదివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎడ్లబండ్ల ఊరేగింపును ఆయా కుల సంఘాల సభ్యులు ప్రారంభించారు. ఎడ్లబండ్లను అందంగా అలంకరించి గ్రామ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఆలయాల చుట్టూ తిప్పారు.