23 March, 2026 | 2:13 AM

Districts

article_88272825.webp
అడవిలో వన్యప్రాణుల ‘విలవిల’

బాన్సువాడ, మార్చి 22 (విజయక్రాంతి): దట్టమైన అటవీ ప్రాంతాలు మైదానాలుగా మారిపోతున్నాయి. స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. పెద్ద పెద్ద వృక్షాలను గొడ్డలి వేటితో నరికి వేయడం వల్ల వన్యప్రాణులు తలదాచుకునే పరిస్థితి లేకుండా మారింది. త్రాగునీరు లేక వన్యప్రాణులు జనావాస ప్రాంతాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో వేటగాళ్ల సంచారం అధికమయ్యింది. కంటికి కనబడ్డ వన్యప్రాణి హతమారుస్తూ, వాటిని కోసి మాంసపు ముద్దలుగా చేసి విక్రయించుకుంటున్నారు. ఇటు టేకుతోపాటు వేప ఇతరాత్ర చెట్లను నరుకుతూ స్మగ్లర్లు కాసులు దండుకుంటున్నారు.

23-03-2026