మాయదారి మాటలకు భ్రమ పడకండి.. ఎల్లారెడ్డి అభివృద్ధికి పట్టం కట్టండి
04-02-2026
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఆయన ఫామ్ హౌస్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12 వార్డులకు కౌన్సిల్ అభ్యర్థులను ఖరారు చేసామని ప్రచారం కూడా కొనసాగిస్తున్నామని రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ, గెలుపు ఖాయమని భీమా వ్యక్తం చేశారు. పత్రికా సమావేశంలో మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎప్పుడు వెనుకబడిన ప్రాంతమని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తుత శాసనసభ్యులు మదన్మోహన్ రావు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని మండిపడ్డారు.