పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
తాడ్వాయి, జూలై 16 (విజయక్రాంతి): తమ ఇంటి పక్కన, వీధులలో, పాఠశాల ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో భరత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల గ్రామంలో గురువారం ఆయన ప్రాథమిక పాఠశాల, ప్రీ ప్రైమరీ, అంగన్వాడి కేంద్రాలను, పాఠశాల ఆవరణలో ఉన్న ఇంకుడు గుంతను, కంపోస్ట్ షెడ్డును పరిశీలించారు.
17-07-2026