కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు
కామారెడ్డి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులను బస్టాండ్లలో నిలిపివేశారు. పోలీస్ ల సహకారంతో ఆర్టీసీ యాజమాన్యం బస్సులను డిపోల నుంచి తీసి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికుల అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్నాయి. కామారెడ్డి బస్టాండ్ తో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిలిచిపోయాయి.
22-04-2026