బడ్జెట్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లు భారీగా పతనం
02-02-2026
ముంబై, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటన స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభా వం చూపింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ఫలితంగా, గత ఆరేళ్లలో బడ్జెట్ రోజున సూచీలు ఇంత భారీ గా పతనం కావడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సెన్సె క్స్, నిఫ్టీలు దాదాపు 2 శాతం మేర నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 80,723 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 495 పాయింట్లు కోల్పోయి 24,825 వద్ద ముగిసింది. అయితే, రోజు మధ్యలో అమ్మకాల ఒత్తిడి తార స్థాయికి చేరడంతో సెన్సెక్స్ ఏకం గా 3,000 పాయింట్ల వరకు పతనమై 79, 899.42 వద్ద ఇంట్రా-డే కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 24,572 స్థాయికి పడిపోయింది.