చెరువులు, కుంటల ఆక్రమణలపై ఉక్కుపాదం
03-02-2026
పటాన్చెరు, ఫిబ్రవరి 2: ప్రభుత్వ భూములలో లేఔట్లు, అనుమతి లేని అక్రమ నిర్మా ణాలు, చెరువులు, కుంటల కబ్జా కొనసాగకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ కబ్జా దారుల పైన ఉక్కుపాదం మోపాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికా రులను ఆదేశించారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాల యంలో జిహెచ్ఎంసి, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష స మావేశం నిర్వహించారు. అమీన్పూర్, పటాన్చెరు బల్దియా సర్కిళ్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నాణ్య త ప్రమాణాల్లో రాజీ పడకుండా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. పటా న్చెరు అమీన్పూర్ సర్కిల్ల పరిధిలోని డివిజన్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాల ప్రగతి నివేదికలపై చర్చించారు.