calender_icon.png 4 February, 2026 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_38825624.webp
కష్టపడితే విజయం తథ్యం

04-02-2026

పటాన్ చెరు, ఫిబ్రవరి 3: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కష్టపడి ప్రజల్లోకి తీసుకెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తథ్యమని మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం ఐదు మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ ఫాం లను అశోక్ నగర్ లోని కాట నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు ఉన్న నాయకులనే కౌన్సిలర్ అభ్యర్థులుగా టికెట్లు కేటాయించినట్లు తెలిపారు. టికెట్ల కేటాయింపులు సర్వే ఆధారంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు వివరించారు.

article_87413549.webp
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకురండి

04-02-2026

సంగారెడ్డి, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డులను గెలిపించుకొని రండి..ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు తెచ్చి అన్ని వార్డుల అభివృద్ధిని నేను చూసుకుంటానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. మంగళవారం తనను కలిసిన అభ్యర్థులు, పార్టీ నాయకులకు జగ్గారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. రామ్ నగర్ అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్ ఉన్నాడని, ఐదేళ్ళ తర్వాత సిద్దు అభ్యర్థిగా ఉంటాడని ప్రకటించారు.

article_39753103.webp
వార్డు అభివృద్ధే నా లక్ష్యం..

03-02-2026

జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 2 : గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారం 13వ వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నానని ఎరుకలి రవి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 13వ వార్డ్ మంత్రి కుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నన్ను ఆదరించి ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే 13వ వార్డ్ మంత్రి కుంట, మాదారం అంబేద్కర్ కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు, ఫార్మేషన్ రోడ్లు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు.

article_80699055.webp
చెరువులు, కుంటల ఆక్రమణలపై ఉక్కుపాదం

03-02-2026

పటాన్చెరు, ఫిబ్రవరి 2: ప్రభుత్వ భూములలో లేఔట్లు, అనుమతి లేని అక్రమ నిర్మా ణాలు, చెరువులు, కుంటల కబ్జా కొనసాగకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ కబ్జా దారుల పైన ఉక్కుపాదం మోపాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికా రులను ఆదేశించారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాల యంలో జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష స మావేశం నిర్వహించారు. అమీన్పూర్, పటాన్చెరు బల్దియా సర్కిళ్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నాణ్య త ప్రమాణాల్లో రాజీ పడకుండా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. పటా న్చెరు అమీన్పూర్ సర్కిల్ల పరిధిలోని డివిజన్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాల ప్రగతి నివేదికలపై చర్చించారు.