calender_icon.png 4 February, 2026 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_21880106.webp
చైర్మన్ గిరిపై కన్ను!

03-02-2026

అలంపూర్ ,ఫిబ్రవరి 2: అలంపూర్ ని యోజకవర్గంలో ఉన్న అలంపూర్, వడ్డేపల్లి, ఐజకు సంబంధించి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రజ ల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.ఆ దిశగా ఇరు పార్టీలు ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేశాయి.దీంతో ఈ ఎన్నికలు ఇరు పార్టీలకు కత్తి మీద సాముగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న అలంపూర్ లో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. ఈ ప్రాంతం బీఆర్‌ఎస్ పార్టీ, ఎమ్మెల్సీ చల్లాకు కంచుకోటగా మా రిందని చెప్పొచ్చు.

article_61576905.webp
సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన తహసీల్దార్ జ్యోతి

03-02-2026

అయిజ ఫిబ్రవరి 2 జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని ఉత్తనూర్ గ్రామం లో ఎన్టీఆర్ స్టేడియం నందు సీఎం కప్ క్రీడలను తహసిల్దార్ జ్యోతి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృ ఢంగా ఉండాలంటే క్రీడలు తప్పనిసరి అని ఆటలలో గెలుపోటములు సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉన్నత స్థా నాన్ని అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తనూర్ సర్పంచ్ రాణెమ్మ, సీఎం కప్ మండల కన్వీనర్ భాస్కర్, ఎంపీడీవో భాస్కర్, ఎంఈఓ రాములు, మండల కన్వీనర్ సతీష్ కుమార్ మరియు విద్యార్థిని వి ద్యార్థులు పాల్గొన్నారు.

article_23780518.webp
కరాటేలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బెల్ట్, ప్రశంసా పత్రాల పంపిణీ

02-02-2026

వడ్డేపల్లి ఫిబ్రవరి 1: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మునిసిపాలిటీలో యమగూచి కరాటేలో ప్రతిభ కనబరచిన 22 మం ది విద్యార్థిని విద్యార్థులకు ఎల్లో బెల్ట్, ప్ర శంశా పత్రాలు పంపిణి చేశామని శాంతినగర్ సేవా సమితి సభ్యులు షేక్ అస్లాం షరీఫ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎదిగే విద్యార్థిని విద్యా ర్థులకు కరాటే తనను తాను రక్షించుకొనే ఒక ఆయుధం లాటిందని ప్రతి ఒక్కరు నే ర్చుకోవాలని అన్నారు. భవిష్యత్ లో ఇంకా ప్రతిభ కనబరిచే మరింత మంది విద్యార్థులకు మా సేవా సమితి తరపున సహాయ స హాకారాలు అందిస్తామని అస్లాం అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు దాసువరం, నాగరాజు, ఖాజా, పవన్ ఇస్మాయిల్, టీచర్ మహమ్ముద్ మరియు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.