06-02-2026
ముంబై: కేంద్ర బడ్జెట్ 2026(Union Budget 2026) తర్వాత తీసుకున్న తొలి ద్రవ్య విధాన నిర్ణయంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) తన కీలక రుణ రేటు అయిన రెపో రేటును 5.25 శాతంగా యథాతథంగా ఉంచింది. కేంద్ర బ్యాంకు ఆర్థిక వ్యూహాన్ని నిర్ణయించడానికి ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిగే ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee) మూడు రోజుల సమావేశం తర్వాత ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం తర్వాత బలమైన వృద్ధి, సుంకాల ఒత్తిడి తగ్గడం మధ్య మునుపటి రేటును కొనసాగించాలనే నిర్ణయం ఊహించిన విధంగానే జరిగింది.
06-02-2026
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: బంగారం, వెండి ధరలు.. భారీగా పతనమయ్యాయి. మంగళ, బుధవారాల్లో పెరిగిన ఈ రెండింటి ధరలు గురువారం మళ్లీ తగ్గి, కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల ప్రభావం వల్ల గత రెండ్రోజులు పెరిగిన బంగారం, వెండి ధరల్లో తాజాగా మళ్లీ లాభాల స్వీకరణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో మళ్లీ ఈ లోహాల ధరలు దిగువకు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,680 పలికింది.
05-02-2026
హైదరాబాద్, ఫిబ్రవరి 4: బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. వెండి కిలో ధర రూ.14 వేలు పెరగగా, బంగారం రూ.1.60 లక్షలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి.
04-02-2026
హైదరాబాద్, ఫిబ్రవరి 3: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కొన్నిరోజులుగా ధరలు ఆకాశాన్నంటాయి. మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అమెరికా ఫెడ్కు కొత్త చైర్మన్ నియామకం, సీఎంఈ మార్జిన్ పెంచడం, గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా విలువైన ఈ ధరలు పతనమవుతూ వచ్చి, తాజాగా మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1.56 లక్షలు పలికింది.
03-02-2026
ముంబై: స్టాక్ మార్కెట్లు(Stock Markets) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2200 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది. అమెరికా టారిఫ్ లు తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. నిఫ్టీ 700 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది. భారత్ పై యూఎస్ సుంకాల తగ్గింపుతో మార్కెట్లు జోష్ కొనసాగుతున్నాయి. భారతదేశంపై అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గించిన తర్వాత, మంగళవారం ఉదయం ప్రారంభ వాణిజ్యంలో రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే 119 పైసలు బలపడి 90.30కి చేరింది.
03-02-2026
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: బంగారు, వెండి ధరలు మరింత తగ్గాయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం తులం పసిడి 1.80లక్షలు, కిలో వెండి రూ.2.48 లక్షలకు చేరాయి. అంతర్జాతీయ అనిశ్చితి, షేర్మార్కెట్ ఒడిదుడుకుల రీత్యా వీటి ధరలు ఇటీవల భారీస్థాయిలో పెరిగగా కొనుగోలుదారులు కూడా బెంబేలెత్తిపోయారు. బంగారం, వెండి ధరలు దిగువకు పడిపోతుండడంతో కొనుగోలుదారులకు మంచి అవకాశమే.