సమ్మక్క సారలమ్మ తల్లుల దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
30-01-2026
రేగొండ,జనవరి 29(విజయక్రాంతి): సమ్మక్క - సారలమ్మ తల్లుల చల్లని దీవెనలు, ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈమేరకు ఆయన గురువారం సాయంత్రం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివార్లలో ప్రకృతి ఒడిలో జరుగుతున్న మినీ మేడారం సమ్మక్క - సారలమ్మ తల్లులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, కోరిన కోరికలు తీరుస్తూ ప్రజల కష్టాలను నెరవేరుస్తున్న గిరిజన ఆదివాసీ దైవం సమ్మక్క - సారలమ్మ అని అన్నారు.