ఆర్సీబీ అలవోకగా.. ముంబై ఉత్కంఠగా
14-04-2025
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: డబుల్ హెడర్లో భాగంగా జరిగిన మ్యాచ్ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు విజయాలు సాధించాయి. బెంగళూరు 9 వికెట్ల తేడాతో రాజస్థాన్పై, ముంబై 12 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయకేతనం ఎగురవేశాయి. బెంగళూరులో కోహ్లీ, సాల్ట్ అదరగొట్టగా ముంబైలో తిలక్, కర్ణ్ శర్మ గెలుపుకు సహకరించారు. ఒకానొక దశలో ఢిల్లీ అలవోకగా విజయం సాధిస్తుందని అనుకున్నా ముంబై బౌలర్ల సమష్టి ప్రదర్శనతో ముంబైని విజయం వరించింది.