calender_icon.png 14 April, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Sports/Eductation

article_50838144.webp
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్

10-04-2025

లాస్ ఏంజిల్స్ 2028లో ఒలింపిక్స్‌ (2028 Olympics) క్రీడల్లో భాగంగా టీ-20 ఫార్మాట్(T20 format)లో క్రికెట్ పోటీలు(Cricket competitions) జరగనున్నాయి. 128 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు నిర్వహించడం విశేషం. ప్రతిష్టాత్మకమైన బంగారు పతకం(Gold medal) కోసం ఆరు జట్లు మాత్రమే పోటీలో ఉంటాయి. చివరిసారిగా 1900లో పారిస్‌లో జరిగిన ఏకైక మ్యాచ్‌గా ఒలింపిక్స్‌లో ఆడారు. క్రికెట్ ఎల్ఏ 2028 క్రీడలలో భాగంగా ఉంటుంది, అలాగే నాలుగు సంవత్సరాల తర్వాత 2032లో బ్రిస్బేన్‌లో జరుగుతుంది. పురుషులు, మహిళలు రెండింటిలోనూ పోటీపడే ఆరు జట్లతో ఎల్ఏ టోర్నమెంట్(LA 2028 Olympics) టీ-20 ఫార్మాట్‌లో ఆడబడుతుందని నిర్వాహకులు బుధవారం ధృవీకరించారు.

article_11195212.webp
సంజు శాంస‌న్‌కు బీసీసీఐ షాక్.. 24 లక్షల జరిమానా

10-04-2025

2025 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు రెండో ఓవర్ రేట్ నేరానికి పాల్పడిన కారణంగా ఆ జట్టు కెప్టెన్ సంజు సామ్సన్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించబడింది. బుధవారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ (జిటి)తో జరిగిన మ్యాచ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు వేయకపోవడంతో ఈ జరిమానా విధించబడింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో(Rajasthan Royals Vs Gujarat Titans) ఓటమి పాలైన తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిన్న రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 58 పరుగుల తేడాతో ఓడిపోయింది.