సైక్లింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
కొత్తపల్లి, మార్చి 20 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శుక్రవారం ఎన్నుకున్నారు. చైర్మన్ గా ‘అల్ఫోర్స్‘ నరేందర్ రెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే నూతనంగా అధ్యక్షునిగా డాక్టర్ కెప్టెన్ బి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సురభి వేణుగోపాల్, కోశాధికారిగా విజగదీశ్వర చారి, ఉపాధ్యక్షులుగా ఎం అరవింద్, ఎస్ రాజయ్య, ఎస్ అనుదీప్, సంయుక్త కార్యదర్శిగా ఎస్ ఇంద్రవేశ్, వీ రమేష్, జై నరేష్ లను ఎన్నుకున్నారు.
21-03-2026