21వ డివిజన్లో కొండపల్లి సతీష్ విస్తృత ప్రచారం
06-02-2026
ముకరంపుర, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): నగరంలోని 21వ డివిజన్లో బీజేపీ అభ్యర్ధి కొండపల్లి సతీష్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని విద్యానగర్, కొత్తయాస్వాడ, శ్రీరాంనగర్ కాలనీ, రేకుర్తి కొత్తవాడ, విజయదుర్గకాలనీ, వినాయకనగర్, వికలాంగులకాలనీ, హరిహరనగర్ కాలనీల్లో ఆయన నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఈ సందర్భంగా కొండపల్లి సతీష్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా మాజీ కార్పొరేటర్ స్వర్గీయ బత్తుల వెంకన్న కుటుంబం ప్రజా సేవకే అంకితమైందన్నారు.