calender_icon.png 4 February, 2026 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_29721551.webp
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

04-02-2026

చొప్పదండి, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం గంగాధర మండలం మండలం బూరుగుపల్లి గ్రామ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధి హామీ నిధులు 8 లక్షల తో నిర్మించిన టాయిలెట్లను ప్రారంభించారు. గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సహకారంతో పాఠశాలలో ఏర్పాటుచేసిన లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ విద్యార్థుల కోరిక మేరకు పాఠశాలలో డైనింగ్ హాల్, తరగతి గదుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

article_47230195.webp
ఆ అధ్యక్షుడెవరు?

04-02-2026

మానకొండూరు, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మానకొండూరు మండల నూతన సర్పంచులు పదవీ ప్రమాణ స్వీకారం చేసి నెల రోజుల పైబడి గడిచినా మండల సర్పం చ్ ల ఫోరం అధ్యక్షుని ఎన్నికపై సందిగ్ధత వీడలేదు. మండలంలో 29 సర్పంచ్ స్థానాలకు గాను బీ ఆర్‌ఎస్ 11, భాజపా రెండు, కాంగ్రెస్ 16 స్థానాలను కైవసం చేసుకున్నా రు. మెజారిటీ స్థానాల్లో అధికార పార్టీ ముం దంజలో ఉండటంతో అధ్యక్షుని స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నప్పటికినీ కాంగ్రెస్ సర్పంచ్ ల మధ్య కొనసాగుతున్న అసమ్మతి రాగంతో వెనుకడుగు వేసే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.. అధ్యక్ష పదవి కాంగ్రెస్ కైవసం చేసుకున్నా ఉపాధ్యక్షు లు, ప్రధాన కార్యదర్శి, తదితర స్థానాలు భా రాస పార్టీ సర్పంచులకు కేటాయించి, సమన్యాయం చేసే పరిస్థితులు కరువై సయోధ్య కుదరక అధ్యక్షుని ఎన్నికపై నీలి నీడలు క మ్ముకున్నాయి.

article_73208476.webp
సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి

04-02-2026

కరీంనగర్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): ఈనెల 11న జరగనున్న మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 5న జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారని, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చొప్పదండిలోని గుమ్లాపూర్ గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహించనున్నామని, అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన నిర్వహించే అవకాశం ఉందన్నారు.

article_33700350.webp
ఆర్నెళ్లలో కాంగ్రెస్‌లో కొట్లాటలు తథ్యం

04-02-2026

కరీంనగర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రానున్న ఆరు నెలల కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ పా ర్టీలో మంత్రులు, నాయకులు మధ్య కొట్లాటలు కావడం తథ్యం అని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. మంగళవారం నగరంలోని 28, 20 వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు కుర్ర తిరుపతి, ఏదుల్ల రాజశేఖర్ కు మద్దతుగా జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణారావు, మాజీ కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్ లతో కలిసి వినోద్ కుమార్ ప్రచారాన్ని నిర్వహించారు.

article_90722382.webp
బరిలో మిగిలింది వీరే..

04-02-2026

కరీంనగర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించిన ఆశావాహుల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలామంది రెబల్ అభ్యర్థులు వివిధ పార్టీల గుర్తులపై, కొందరు స్వతంత్రంగా బరిలో నిలవడంతో ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లకుగాను 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి 66 చొప్పున, కాంగ్రెస్ నుంచి సీపీఐ మిత్ర పక్షానికి ఒకటి పోనూ 65 స్థానాల్లో బరిలో ఉన్నారు. జమ్మికుంటలో మొత్తం 30 వార్డులు ఉండగా 159 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.