calender_icon.png 6 February, 2026 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_79064309.webp
అంతా పీఆర్‌వో చెప్పినట్టే..!

06-02-2026

కరీంనగర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల వద్ద పీఆర్వోలుగా పనిచేసే వారి చర్యల వల్ల సిసలైన కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందిగా మా రుతుంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కరీంనగర్ యోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు వద్ద పి’ఆర్’ వోగా ఉన్న వ్యక్తి వ్యవహారశైలి తలనొప్పిగా మారిం ది. అన్నీతానై సదరు నాయకుడిని తప్పుదోవ పట్టించడం వల్ల టికెట్ల విషయంలో చా లాచోట్ల పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. సదరు పీఆర్వో గతంలో ఓ మంత్రి వద్ద పనిచేసి రా జ్యాంగేతర శక్తిగా మెదలడం, ఎన్నికల సమయంలో ఇతని వ్యవహార శైలిపై పలు ఫిర్యాదులు రావడంతో ఆ మంత్రి అతన్ని పక్కకు పెట్టారు.

article_21143382.webp
భారత ఆర్థిక వ్యవస్థపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు

06-02-2026

కొత్తపల్లి, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండవ రోజున యూ నివర్సిటీ ఆరట్స్ అండ్ లా కళాశాల సెమినార్ హల్ లో ‘భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రి మ మేధస్సు యొక్క ప్రభావం ‘అనే అంశంపై రెండు రోజుల జాతీయస్థాయి సదస్సు ముగిసింది. రెండవ రోజు సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఉపకులపతి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ గారు మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు అనేది యంత్ర అభ్యాస విధానంతో అనుసంధానం చేసుకొని తన యొక్క పనులను చేసుకుంటుందని, ఇంజనీరింగ్ విభా గంలో కృత్రిమ మేధస్సును విరివిగా ఉపయోగిస్తున్నారని మరియు ఖగోళ శాస్త్రంలోని సర్వేల నుండి సమాచారాన్ని కృత్రిమ మేధస్సు విశ్లేషిస్తుందని వివరించారు.