calender_icon.png 31 March, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_10423461.webp
ప్లాస్టిక్ కాలుష్య రహిత పట్టణంగా తీర్చిదిద్దుతాం

31-03-2025

మహబూబాబాద్. మార్చి.29: (విజయ క్రాంతి) జన విజ్ఞాన వేదిక, జమయత్ ఇస్లామిక్ హింద్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక కరపత్రం విడుదల చేశారు. మహబూబ్ జిల్లా ప్రజలకు విశ్వవసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పక్షుల కుహకుహలు మాయమవుతున్న వేళ... షడ్రుచులు జీవన మాధుర్యాన్ని నింపుతూ... విశ్వమంంచిన తాకుతున్న విద్వేషాల పిచ్చిని చెరుపుతూ... పరస్పరం మానవనీయ బంధాల మట్టి పరిమళం పెద్ద జల్లే ఆకాంక్షలతో ఉగాది ఆహ్వానిస్తూ మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. రాబోయే తరాలకు కాలుష్య రహిత సమాజం అందించాలని ప్రేమ ఆప్యాయతలు పంచాలన్నారు.

article_75445447.webp
కోటి రూపాయల విలువైన గంజాయి దహనం

29-03-2025

మహబూబాబాద్ మార్చి.28: (విజయ కాంతి )మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సీజ్ చేయబడిన ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు (1,28,29,400/-) విలువైన 513 కేజీ 176 గ్రాముల గంజాయిని మహబూబాబాద్ జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు.కాకతీయ మెడిక్లీన్ ఏజెన్సీ, ఊర్సుగుట్ట, హన్మకొండలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS మరియు మాధకాడ్రావ్యాల నిరోధక శాఖ ఆదేశాలమేరకు డ్రగ్ డిస్పోసల్ కమిటీ సభ్యుల సమక్షంలో గంజాయి దహనం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పీ గండ్రతి మోహన్,టౌన్ డిఎస్పీ తిరుపతి రావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, గూడూరు సీఐ సూర్య ప్రకాష్, మరిపెడ సీఐ రాజకుమార్, అధికారులు పాల్గొన్నారు.

article_31306141.webp
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన

29-03-2025

మహబూబాబాద్, మార్చి28 (విజయ క్రాంతి): వక్ఫ్ సవరణ బిల్లు’ను వ్యతిరేకిస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో హౌసింగ్ బోర్డ్ సీతారాంపురం లో ఉన్న మస్జిద్-ఏ -రహమానియా లో ముస్లింలు శాంతియుత నిరసన చేపట్టారు. మస్జిద్-ఏ రహమానియా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆల్ పార్టీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ సదర్ సయ్యద్ సర్వర్,యాకుబ్ పాషా, బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకులుసయ్యద్ లతీఫ్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఒక్కో బిల్లును ప్రవేశపెడుతోందని విమర్శించారు.

article_56639582.webp
వన్‌బై 70 చట్టాన్ని వెంటనే అమలు చేయాలి

29-03-2025

మహబూబాబాద్.మార్చి 28:(విజయ క్రాం తి) ఏజెన్సీ మండలాల్లో అమలు పరచవలసిన వన్ బై 70 చట్టాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వెంటనే ఆ చట్టాన్ని అమలు చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ సిద్దబోయిన భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో జిల్లా ఉపాధ్యక్షుడు మంకిడి సురేష్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ఏజెన్సీ మండలాల్లో అమలు చేయాల్సిన వన్ బై సెవెంటీ చట్టాన్ని అమలు చేయకుండా జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ విచ్చలివిడిగా రియల్ ఎస్టేట్ దందాకు సహకరిస్తున్నారని ఆరోపించారు.

article_65803978.webp
హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ

29-03-2025

మహబూబాబాద్, మార్చి 28 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలోని దామరవంచ గ్రామంలోని తెలంగాణ గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ బాయ్స్ వసతిగృహాన్ని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని పరిసరాలను పరిశీలించారు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పక్కాగా డైట్ మెనూ పాటించాలని, షెడ్యూల్ ప్రకారం పిల్లలకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించాలని, ప్రతి సబ్జెక్టులో అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, రాత్రి సమయాలలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, ప్రస్తుత ఎండాకాలం దృశ్య కావాల్సిన సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అన్నారు. వసతి గృహంలో ఏమైనా మైనర్ రిపేర్ ఉంటే వెంటనే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ వెంట కాలేజీ ప్రిన్సిపల్ హేమంత్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ విస్తరణ అధికారి సంబంధిత సిబ్బంది ఉన్నారు.

article_52448951.webp
అర్హులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి

27-03-2025

మహబూబాబాద్, మార్చి 26 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ భూ పోరాట కేంద్రాన్ని బుధ వారం సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి సందర్శించారు అనంతరం ఏర్పాటు చేసిన భూ పోరాట సిపిఐ సమావేశంలో బి.అజయ్ సారధిరెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంతోమంది అర్హులైన నిరుపేదలు ఇంటి స్థలాలు లేక కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని వారందరికీ ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలని అన్నారు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రజలను మోసం చేసిందని కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజలందరినీ ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెరుగు కుమార్ రేశ పల్లి నవీన్ చింతకుంట్ల వెంకన్న ఎండి ఫాతిమా వెలుగు శ్రవణ్ ఎండి మహమూద్ ఆబోతు అశోక్ జలగం ప్రవీణ్ పద్మ మంద శంకర్, డి రమేష్ నాంచారి దాసు లాలు వంగ శీను తదితరులు పాల్గొన్నారు

article_67632041.webp
ప్రజలకు మరింత మెరుగైన సేవలు

27-03-2025

కాటారం (భూపాలపల్లి) , మార్చి 26 (విజయక్రాంతి) : ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమర్థంగా, సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం గణపురం తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులు విచారణ, తాగు, సాగునీరు, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అంశాలపై రెవెన్యూ, పంచాయతి రాజ్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులు తమ తమ విభాగాలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

article_13359815.webp
బీమా సొమ్ము రూ.20 లక్షలు అందజేత

27-03-2025

మహబూబాబాద్. మార్చి 26: (విజయక్రాంతి) మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం సబ్ స్టేషన్ తండా మాజీ సర్పంచ్ గుగులోతు వెంకన్న గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసముద్రం బ్రాంచ్ నందు రెండు లక్షల ప్రమాద బీమా చేయడంతో ఆ పథకం ద్వారా మంజూరైన రూ.20 లక్షల బీమా క్లెయిమ్ చెక్కును మృతుడు వెంకన్న భార్య కళ్యాణికి బుధవారం అందజేశారు.వెంకన్న కేసముద్రం ఎస్బిఐలో తన ఖాతా ద్వారా వెయ్యి రూపాయలు చెల్లించి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకంలో చేరినట్లు ఎస్బిఐ డిజిఎం గన్ శ్యామ్ సోలంకి, ఆర్ ఎం షేక్ అబ్దుల్ రహీం, స్టేట్ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్, జనరల్ ఇన్సూరెన్స్ క్లస్టర్ మేనేజర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ పథకంలో చేరి ప్రమాదంలో మరణించడం వల్ల వెంకన్న నామిని అయిన భార్య కల్యానికి బీమా సొమ్ము చెక్కును అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతా ద్వారా ప్రమాద బీమా పథకంలో చేరడం వల్ల ఆపత్కాలంలో కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని చెప్పారు.

article_65473990.webp
సర్వమతాల సారం ప్రజా హితమే

27-03-2025

మహబూబాబాద్ .మార్చి 26: (విజయక్రాంతి):సర్వ మతాల సారం ఒక్కటే అని,అంతా కలిసి మెలసి సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి అన్నారు.బుధవారం ఆయన మరిపెడ మున్సిపాలిటీ 9వ వార్డు మాజీ కౌన్సిలర్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిదో వార్డులోని ఫాతిమా మసీదులో రంజాన్ నెల ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా యువ నాయకులు నూకల అభినవరెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు వేసవిలో కఠోరమైన రంజాన్ ఉపవాస దీక్షలు ఉంటూ భక్తి శ్రద్ధలతో అల్లాహ్ ను ప్రార్థిస్తుంటారన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాల సమ్మేళనమని,అన్ని వర్గాల ప్రజలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు.