calender_icon.png 4 February, 2026 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_67940945.webp
గురుకుల విద్యార్థినికి పాము కాటు

04-02-2026

మహబూబాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థిని వి. అస్మిత మంగళవారం పాము కాటుకు గురైంది. దండంపై దుస్తులు తీస్తున్న క్రమంలో ఆమె చేతిపై పాము కాటు వేయడంతో వెంటనే కేకలు వేయగా అప్రమత్తమైన సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెను హుటాహుటిన 108 అంబులెన్స్‌లో మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి ప్రాణాపాయం తప్పించారు. హాస్టల్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుతున్నప్పటికీ సమీపంలో వ్యవసాయ భూములు ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, విద్యార్థినిని కాటు వేసిన పాము విషపూరితమైంది కాదని, దీంతో విద్యార్థినికి ఎలాంటి ప్రాణాపా యం లేదని వైద్యులు నిర్ధారించినట్టు ప్రిన్సిపల్ జయశ్రీ తెలిపారు.

article_41361112.webp
మున్సిపల్ బరిలో మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు

04-02-2026

కేసముద్రం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్లుగా మాజీలైన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇందులో సర్పంచులుగా గ్రా మాన్ని ఐదేళ్లపాటు పరిపాలించిన వారు ఇ ప్పుడు వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికల బరిలో దిగడం విశేషంగా మారింది. అలాగే గత ట ర్ములో వార్డు సభ్యులు గా ఎన్నికైన వారు, మాజీ ఎంపీటీసీలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి కాలు దువ్వుతున్నారు. కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామాలను విలీనం చేసి కేసముద్రం మున్సిపాలిటీగా ఏ ర్పాటు చేశారు.

article_65362453.webp
4.5 కిలోల గంజాయి స్వాధీనం

02-02-2026

మహబూబాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో 4.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తొ ర్రూర్ డిఎస్పీ కృష్ణకిషోర్ తెలిపారు. డీఎస్పీ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తొర్రూరు పోలీస్ స్టేషన్ 2వ ఎస్‌ఐ ఎం. శివరామకృష్ణ, తమ సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం తొర్రూరు బస్టాండ్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా హైదరాబాద్ బస్సులు నిలిచే ప్లాట్ఫారం వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా గమనించి, వారిని అదుపులోకి తీసు కుని విచారించగా, విశాఖపట్నం నుండి హైదరాబాద్కు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వెల్లడించారన్నారు.

article_61285993.webp
ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

31-01-2026

మహబూబాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): రైతులు అధికంగా రసాయన ఎ రువులు, క్రిమిసంహారక మందులను మో తాదుకు మించి వినియోగించడం వల్ల భూమి, నీరు గాలి కాలుష్యం పెరుగుతున్నదని, అంతే కాకుండా సాగు ఖర్చులు పెరిగి పోవడంతో ఆశించిన దిగుబడులు రాక రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతు ల్లో రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫా ర్మింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జె.వి.ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం, మల్యాల కేంద్రంగా ఐదు రోజుల పాటు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.

article_54541580.webp
అవగాహనతో కుష్టువ్యాధి నివారణ

31-01-2026

మరిపెడ,జనవరి 30(విజయక్రాంతి): మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో జాతీయ కుష్టు అవగాహన కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో జాతీయ కుష్టు అవగాహన పక్షోత్స వాల కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ రవి మాట్లాడుతూ 30 జనవరి 2026 రోజున మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కుష్టి వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రతి పిహెచ్సిలో మరియు ప్రతి గ్రా మపంచాయతీలో వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో ప్రతిజ్ఞ చేయిస్తూ కుష్టు వ్యాధి పై సంపూర్ణ అవగాహన కలిగే విధం గా కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలియజేశారు.