మున్సిపల్ బరిలో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు
04-02-2026
కేసముద్రం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్లుగా మాజీలైన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇందులో సర్పంచులుగా గ్రా మాన్ని ఐదేళ్లపాటు పరిపాలించిన వారు ఇ ప్పుడు వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికల బరిలో దిగడం విశేషంగా మారింది. అలాగే గత ట ర్ములో వార్డు సభ్యులు గా ఎన్నికైన వారు, మాజీ ఎంపీటీసీలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి కాలు దువ్వుతున్నారు. కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామాలను విలీనం చేసి కేసముద్రం మున్సిపాలిటీగా ఏ ర్పాటు చేశారు.