22 April, 2026 | 1:26 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

Districts - Mahabubabad

article_49317218.webp
RTC Strike Today: డిపోల వద్ద సమ్మె.. వందల బస్సులు నిలిపివేత

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మె(RTC Strike Begins) ప్రారంభించారు. తెల్లవారు నుండే డిపోల ఎదుట కండక్టర్లు డ్రైవర్లు ఇతర కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. వరంగల్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 9 డిపోల వద్ద సమ్మె ప్రారంభించారు. కార్మికులు సమ్మెకు దిగడంతో మొత్తంగా వెయ్యికి పైగా ఆర్టీసీ, అద్దె బస్సులు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. రీజియన్ పరిధిలో ఆర్టీసీ రెగ్యులర్ సిబ్బందితోపాటు 600 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిపి మొత్తంగా 3,900 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు తీయలేదు. డ్రైవర్లు, కండక్టర్లు , కార్మికులు విధులు బహిష్కరించి ఆర్టీసీ బస్టాండులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

22-04-2026

article_35937994.webp
పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’

మహబూబాబాద్,(విజయక్రాంతి): పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు మాజీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కా రావు దామోదర్ తన పుట్టినిల్లు ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడువాయి మండలం కాల్వపల్లికి చేరుకున్నాడు. పీపుల్స్ వార్ పార్టీలో చేరిన చొక్కారావు అంచలంచలుగా ఎదిగి రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వహించి అనేక సంచలన ఘటనల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఎదుట చొక్కారావ్ లొంగిపోయారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన స్వగ్రామానికి చేరుకుని తల్లి బతుకమ్మ ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చొక్కారావ్ చాలా ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత మొట్టమొదటిసారిగా అజ్ఞాతం వీడి గ్రామానికి చేరుకోవడంతో ప్రజలు ఆయన్ని చూడడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

21-04-2026