కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao), మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావులకు ఊరట లభిస్తూ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై(Kaleshwaram Lift Irrigation Project) జస్టిస్ పీ.సీ. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోకూడదని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పు ఇచ్చింది. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో కేసీఆర్, హరీశ్ రావుతో పాటు స్మితా సబర్వాల్, ఎస్ కే జోషికి హైకోర్టులో ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని తెలిపింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక(Justice P.C. Ghose Commission Report) ఇచ్చింది.
22-04-2026