ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటం: నితిన్ నబిన్
04-02-2026
హైదరాబాద్: మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం(Vijay Sankalp Sammelan) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్(BJP National President Nitin Nabin), రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ... తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వీరుకులకు కాషాయ దళపతి నమస్కరించారు.