22 April, 2026 | 2:17 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

Districts - Hyderabad

article_10274961.webp
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (Former CM Nadendla Bhaskara Rao Passes Away) కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాదెండ్ల భాస్కరరావు తుది శ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో జన్మించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయంనుంచి లా చదివారు. నాదెండ్ల భాస్కరరావు 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజులపాటు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రిచెన్నారెడ్డి, అంజయ్య హయాంలో భాస్కర్ రావు మంత్రిగా పనిచేశారు. 1998లో భాస్కర్రావు ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ భాస్కర్ రావు కుమారుడు. భాస్కరరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

22-04-2026

article_58493081.webp
కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao), మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావులకు ఊరట లభిస్తూ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై(Kaleshwaram Lift Irrigation Project) జస్టిస్ పీ.సీ. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోకూడదని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పు ఇచ్చింది. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో కేసీఆర్, హరీశ్ రావుతో పాటు స్మితా సబర్వాల్, ఎస్ కే జోషికి హైకోర్టులో ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని తెలిపింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక(Justice P.C. Ghose Commission Report) ఇచ్చింది.

22-04-2026

article_62966435.webp
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బస్టాండ్లలో నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు కొన్ని డిపోల్లో ఆర్టీసీ అద్దె బస్సులను నడిపిస్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మెతో(TGSRTC Strike) ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పాక్షికంగా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండలో 180కి పైగా ఎలక్ట్రిక్ , ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 650 బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీ సిబ్బంది విధులు బహిష్కరించి డిపోల వద్ద ఆందోళన చేస్తున్నారు.

22-04-2026