10 May, 2026 | 9:06 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

నల్గొండ బీజేపీలో లొల్లి

25-12-2025 03:09 PM

హైదరాబాద్: నల్గొండ జిల్లా(Nalgonda district) బీజేపీ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్గొండ బీజేపీలో(Nalgonda BJP leaders ) రెండు వర్గాల మధ్య విభేదాలు కారణంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీ తరుఫున గెలిచిన సర్పంచ్ లకు సన్మానం విషయంలో వివాదం జరిగింది. బీజేపీ నేత పిల్లి రామరాజుపై ఓ వర్గం దాడి చేసింది. మరో వర్గం జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డిపై దాడికి ప్రయత్నించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్దకు భారీగా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.