17 July, 2026 | 3:03 AM

కాంగ్రెస్‌లో ‘కన్వీనర్’ కాక!

17-07-2026 02:46 AM

కాంగ్రెస్ పార్టీ లో మరోసారి బయటపడ్డ విభేదాలు 

కన్వీనర్ పోస్టులో చక్రం తిప్పిన ఐకే రెడ్డి 

శ్రీహరి రావు వర్గానికి దక్కని ప్రాతినిథ్యం 

ముధోల్‌లో కూడా అదే పరిస్థితి 

నిర్మల్ జులై 16 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపితమే లక్ష్యంగా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రకటించిన మండల కన్వీనర్ల జాబితా కాంగ్రెస్ పార్టీలో కల్లోల్లని సృష్టించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిన నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తగ్గకపోగా మరింత పెరగడం అటు కార్యకర్తలను ఇటు నేతలను అయోమయానికి గురిచేస్తుంది.

పని చేస్తే కార్యకర్తలకు పార్టీ పదవులు ఇస్తామని సమావేశాల్లో ప్రకటిస్తున్న పార్టీ అధిష్టానం అందుకు విరుద్ధంగా పదవుల పంపకంలో పైరవీలకి ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తోంది. నిర్మల్ జిల్లాలో నీ ముధోల్ నిర్మల్ ఆయా మండలాలకు జిల్లా పార్టీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ మంగళవారం మండల కన్వీనర్లను అధికారికంగా ప్రకటించారు.

పార్టీ పదవులు దక్కుతాయని ఆశపడ్డ కొందరికి నిరాశ పడగా ఒకే వర్గం చెందిన నాయకులకు మండల కన్వీనర్ల నియామకంలో ప్రాధాన్యత ఇవ్వడం మరో వర్గం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నామా లేదా మాకైతే తెలవడం లేదు, పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నాం, పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని నమ్ముకుని బతికినం, మాకు పదవులు ఇవ్వకుండా పార్టీ మారి మళ్ళీ పార్టీ లోకి వచ్చిన వారికి ఎలా పదవులు ఇస్తారంటూ ఓవర్గం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. 

ఒక వర్గం వారికి ప్రాధాన్యత 

నిర్మల్ జిల్లాలో మంగళవారం ప్రకటించిన మండల కాంగ్రెస్ పార్టీల కన్వీనర్ల ఎంపిక ఒక వర్గం వారికి ప్రాధాన్యత ఇస్తుందని తమ పరిస్థితి ఏం కావాలని ప్రత్యర్థి వర్గం ప్రత్యక్ష ఆందోళనకు దిగడం కాంగ్రెస్ పార్టీలో వర్గ ఉన్నాయ్ అనడానికి బలమైన కారణం. మంగళవారం ప్రకటించిన అధికారిక జాబితాలో సారంగాపూర్ మండల కన్వీనర్ మాధవరావు, నిర్మల్ రూరల్ మండల కన్వీనర్ పూలస మల్లేష్ ను మార్చాలని వర్గానికి చెందిన వారు సారంగపూర్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించడం కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారి తీసింది.

నిర్మల్ రూరల్ మండలంలో పోలాస మల్లేష్ నియామకంపై అదే పార్టీకి చెందిన నేతలు అభ్యంతరం తెలుపుతూ అధిష్టానం ఫిర్యాల్ చేసేందుకు సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక దిల్వార్పూర్ మండలంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెడ్డి వర్గం చెందిన దేవేందర్ రెడ్డి, సోన్ మండలానికి మొయినుద్దీన్, నిర్మల్ పట్టణంలో ఆకుల హరీష్ కు కన్వీనర్ పోస్టులు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు వర్గం నుండి నరేష్ రెడ్డి, మామడ చెందిన సంతోష్కు కన్వీనర్ పోస్ట్ పొందారు.

నర్సాపూర్ జీ లో కూడా మోబిలాలకు పదవులు దక్కినట్టు చెప్తున్నారు. మొత్తం ఎనిమిది పోస్టుల్లో ఆరు పోస్టులు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్గానికి దక్కడంతో శ్రీ హరి రావు సంతృప్తి తో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అనుచరులుగా ఉన్న వారికి పార్టీ అధిష్టానం పదవులు ఇచ్చిందని కష్టకాలంలో పార్టీలో పనిచేసిన తమ వర్గీలకు పదవులు ఇవ్వకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. సీనియర్లు జూనియర్ల లెక్క తీసుకున్న జూనియర్లకు పదవులు వచ్చాయని వారు వాదిస్తున్నారు. 

 ముధోల్ నియోజకవర్గం 

నిర్మల్ జిల్లాలోని ముధోల్ నియోజకవర్గంలో కూడా మండల కన్వీనర్ల నియామకం రాజకీయ దు మారం రేపుతుంది. ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ , సీనియర్ నేతగా మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమంలో ఇద్దరు పాల్గొన్నారు పదవుల విషయంలో మాత్రం తమ వర్గీయులకు పదవులు దక్కించుకునేలా ఇద్దరు నేతలు పావులు కలిపారు.

ఇందులో కుంటాలకు ఆనందరావు పటేల్, భైంసాకు గజానంద్, బాసరకు లక్ష్మణరావు నారాయణరావు పటేల్ వర్గీయులుగా చెప్పుకుంటున్నారు. మిగతా మండలంలో కుబీర్ కు మైపాల్ రెడ్డి తానూరుకు పుండ్లికిరావు లోకేష్ వరకు ముత్త గౌడ్ బైంసా పట్టణానికి అరవింద విట్టల్ రెడ్డి వర్గాలుగా చెప్పుకుంటున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే లైన్ నారాయణరావు పటేల్ విట్టల్ రెడ్డి బలమైన నేతలు కావడంతో తన వర్గీలకు కన్వీనర్ పోస్టులు ఇప్పించుకోగా ప్రత్యర్థి వర్గం వారు సీనియర్లకు కాకుండా పార్టీ మారి వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని గట్టిగా అని ప్రశ్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అసలే బలహీనతగా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పోస్టులు కారణంగా మరింత విభేదాలు ఏర్పడి పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికి కొందరు నేతలు డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి దృష్టికి సమస్య తెచ్చినట్టు చెప్తున్నారు. పార్టీ అధిష్టానం కన్వీనర్ల నియామక అసంతృప్తి ప్రక్రియను ఏ మేరకు సర్దుబాటు చేసి పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుందో కాలమే వేచి చూడాలి.