10 May, 2026 | 10:16 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు

25-12-2025 02:42 PM

కిటకిటలాడిన చర్చీలు 

విజయక్రాంతి,పాపన్నపేట: వెలుగులు విరజిమ్మే కొవ్వొత్తుల కాంతులు.. క్రిస్మస్ చెట్లు.. బాల యేసు జన్మ వృత్తాన్ని తెలిపేలా అలంకరించిన పాకలు.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు క్రైస్తవ సోదర, సోదరీమణులతో కిటకిటలాడాయి. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని ఆయా గ్రామాల్లోని క్రైస్తవ సోదర, సోదరీమణులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఏసుప్రభు నామస్మరణలతో క్రైస్తవాలయాలు మార్మోగాయి. సంఘ కాపరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శాంతి సందేశాలు చేసారు.