గుర్తు తెలియని వాహానం ఢీకొట్టి ఐదు పాడి గేదలు మృతి
09-05-2026 08:12 PM
మంగపేట,(విజయక్రాంతి): గుర్తు తెలియని వాహానం ఢీకొట్టడంతో ఐదు పాడి గేదలు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం (నూగురు) మండలం పాత్రాపురం గ్రామ శివారులో శనివారం జరిగింది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపురం (నూగురు) మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన రాంబాబు అనే రైతు గేదేలను మేత కోసం పాలెం వాగు సమీపంలోని పొలాల్లోకి శుక్రవారం ఉదయం తోలినట్లు తెలిపారు. కాగా శుక్రవారం రాత్రి గేదలు ఇంటికి రాలేదని తెలిపారు. గేదెలు ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం గేదల కోసం వెతుకుతుండగా చర్ల వెంకటాపురం రహదారిపై పాత్రాపురం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహానం డీ కొట్టగా మృతి చెంది కనిపించాయి.






