గంజాయి జోలికి వెళితే జైలే గతి..
గోవిందరావుపేట, జూన్ 26 (విజయక్రాంతి): గంజాయి జోలికి వెళితే జైలు పాలు కాక తప్పదని, ఉజ్వల భవిష్యత్తులో నాశనం చేసుకోవద్దని పసర ఎస్ఐ తాజుద్దిన్ యువతకు పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాలతో, డి.ఎస్పి రవీందర్ సూచనలతో, పసర సీ.ఐ. పత్తిపాక దయాకర్ పర్యవేక్షణలో ఎస్ఐ తాజుద్దీన్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల దినోత్సవం సందర్భంగా రామాలయం సర్కిల్ పరిధిలో నుంచి పసర చౌరస్తా 163 జాతీయ రహదారిపై 200 యువతతో భారీ ర్యాలీ నిర్వహించారు.
27-06-2026