3 April, 2026 | 3:31 AM

Districts - Mulugu

article_85317994.webp
గ్రామాల అభివృద్ధికి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక

మంగపేట, (విజయక్రాంతి): గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అధికారులు పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ములుగు జిల్లా మంగపేట ఎంపీడీఓ బి.బద్రు నాయక్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీలలో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామ సభలలో తెలంగాణ గీతాన్ని ఆలపించి అనంతరం ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను గ్రామసభలలో చదివి వినిపించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై గ్రామసభల్లో విస్తృతంగా చర్చించారు.

02-04-2026