04-02-2026 08:18:27 PM
శామీర్ పేట్,(విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలో కి వచ్చిక ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపటారో చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అలియబాద్ మున్సిపల్ కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.... కాంగ్రెస్ అధికారంలో కి వచ్చి 2 సవత్సరాలు దాటినా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపటారో చూపించాలన్నారు. చూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తాన్నారు. కాంగ్రెస్ కి దమ్ముంటే మల్లారెడ్డి పై పోటీ చేసి వెలిచిచూపించండి అని హెద్దేవా చేశారు. గత సంవత్సరం క్రితం కూడా అలియబాద్ మున్సిపాలిటీ లో రోడ్డు, గుళ్ళు కట్టించింది మల్లారెడ్డి ఏ అని తెలిపారు.