18 April, 2026 | 6:02 PM

విజయ క్రాంతి ప్రజల గొంతుకగా నిలుస్తోంది

18-04-2026 04:41 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విజయ క్రాంతి దినపత్రిక ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను వెలుగులోకి తీసుకువస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. పత్రిక వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఆమె నివాసంలో స్టాఫ్ రిపోర్టర్ చిప్ప సురేష్, కౌన్సిలర్ చిలువేరు వెంకటేశ్వర్లు, రిపోర్టర్ శ్రీనివాస్‌లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయ క్రాంతి పత్రిక ఆవిర్భవించిన తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిందన్నారు.

అవినీతి ఆరోపణలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తూ పత్రిక తన విశ్వసనీయతను నిలబెట్టుకుంటోందని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సంబంధించిన వార్తలను ప్రచురిస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని అభినందించారు.ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవన్, భీమేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.