బాన్సువాడ బాధిత కుటుంబాలను పరామర్శించిన కేంద్రమంత్రి
03-03-2026 12:09 AM
నిజాంసాగర్, మార్చి 2 (విజయ క్రాంతి): బాన్సువాడలో జరిగిన ఘర్షణలో జైలులో ఉన్న కుటుంబాలను కేంద్రమంత్రి బండి సంజయ్ సోమవారం నాడు బాన్సువాడ పట్టణంలో పరామర్శించారు. నిజాంసాగర్ మండలం తుంకి పల్లి గ్రామానికి చెందిన సొన్నాయిల విట్టల్ ఫై కేసు నమోదయి జైలులో ఉండడంతో తండ్రి సోన్నాయిల రాములు ను ఓదార్చారు. ఆయనతోపాటు గ్రామస్తులు లింగాల శంకర్, తదితరులు ఉన్నారు.




