రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
బోధన్:విజయక్రాంతి: ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ సమన్వయంతో మోస్రా (గ్రామం & మండలం) లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎం సాయి చరణ్, కీటక శాస్త్రవేత్త, రైతులు పురుగు-తెగుళ్ల మందులను అవసరం మేరకు జాగ్రత్తగా పిచికారీ చేయాలని సూచించారు. వేపనూనె, అజాడిరక్తిన్ మందులను పంటలపై పురుగుల గుడ్ల సమూహలాను, తొలి దశ లార్వలను నివారణకు ఉపయోగించాలని, లింగాకార్షక బుట్టలను ఉపయోగించి పురుగుల ఉదృతిని గుర్తించి, సమగ్ర సస్య రక్షణ చర్యలను చేపట్టాలని తెలిపారు.
16-05-2026