పోలీస్ పరేడ్ గ్రౌండ్స 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుకలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు బృందాల కవాతును ఆయన పరిశీలించారు.
15-08-2026