నాయకుడిగా కాదు.. సేవకుడిగా ఉంటా..
* కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు నరేందర్ గౌడ్
పాపన్నపేట: అందరి సహాయ సహకారాలతో పార్టీ అభివృద్ధికి నాయకుడిగా కాదు.. సేవకుడిలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షులు లింగంపేట నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మండల బాధ్యతలను అప్పగించిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ లకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా కలసి కట్టుగా కృషి చేసేందుకు ప్రతి గ్రామ కార్యకర్తలను కలిసి గ్రామ సమస్యలను ఎమ్మెల్యే రోహిత్ రావు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తానన్నారు. కార్యకర్తలఅందరి సహాయ సహకారాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తానన్నారు.






