విజయవంతంగా ధాన్యం కొనుగోళ్లు
మెదక్, జులై 1 (విజయక్రాంతి): రైతులు, అధికారుల సమన్వయంతో వరి ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, అదనపు ఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్, వ్యవసాయ, సివిల్ సప్లై, గ్రామీణ అభివృద్ధి, పోలీసు శాఖలతో ధాన్యం కొనుగోలు విజయవంతంపై సమావేశం నిర్వహించారు.
02-07-2026